ETV Bharat / state

Harish rao: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపించిన ఘనత కేసీఆర్‌దే

author img

By

Published : Jun 20, 2021, 3:46 PM IST

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాక.. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపించిన ఘనత సీఎం కేసీఆర్​దేనని మంత్రి హరీశ్​రావు తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తిలో సిద్దిపేట ఐదో స్థానంలో నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

harish rao
Harish rao: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపించిన ఘనత కేసీఆర్‌దే

Harish rao: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపించిన ఘనత కేసీఆర్‌దే

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. యాసంగిలో దేశంలోనే ఎక్కువగా ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తిలో సిద్దిపేట ఐదో స్థానంలో నిలిచిందని.. యాసంగిలో ఈ ఒక్క జిల్లాలోనే 5లక్షల 30 వేల మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని మంత్రి స్పష్టం చేశారు. గతంలో కరువు కాటకాలతో వెనుకబడిన జిల్లాను అభివృద్ధి పరిచిన ఘనత సీఎం కేసీఆర్​దేనని ఆయన వెల్లడించారు.

1983లో సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్​ ప్రభుత్వాన్ని కేసీఆర్​ కోరారని... తెలంగాణ ఏర్పాటు అనంతరం సిద్దిపేటను జిల్లా చేయడమే కాకుండా అద్భుత భవన సముదాయాన్ని ఏర్పాటు చేయడం అరుదైన ఘట్టమన్నారు. ఎన్నో పోరాటాలతో, త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామని మంత్రి హరీశ్​ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: CM KCR : సిద్దిపేటలో ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.