ETV Bharat / state

తాళం వేసిన ఇళ్లే ఆదొంగల టార్గెట్ - నగరంలో బెంబేలెత్తిస్తున్న వరుస చోరీలు - Massive theft in Shameerpet

author img

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 10:58 PM IST

Robbery Incidents in Hyderabad : హైదరాబాద్​ నగరంలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. చెడ్డీ గ్యాంగ్‌ సహా, పలుచోట్ల భారీ చోరీ ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. ఇళ్లు వదిలి వెళ్లాలంటేనే నగరవాసులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రధానంగా తాళం వేసిన ఇళ్లనే టార్గెట్​ చేస్తూ, భారీ చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా నగరంలోని శామీర్​పేట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఇద్దరి ఇళ్లలో సుమారు 30 తులాల బంగారం, కొంత మొత్తంలో సొమ్మును అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Thieves Target a Locked houses
Massive theft in Shameerpet (ETV Bharat)

Massive theft in Shameerpet : తాళం వేసిన ఇళ్లనే టార్గెట్​గా చేసుకుంటూ భారీ చోరీలకు పాల్పడుతున్న ఈ దొంగలు పోలీసులకే సవాల్​ విసురుతున్నారు. మూడురోజుల క్రితం నగరంలోని శామీర్​పేట్​ కాలనీలో అనిల్ కుమార్ యాదవ్ అనే యజమాని ఇంటికి తాళం వేసి ఫంక్షన్​కు వెళ్లాడు. తిరిగి ఇంటికి 10 గంటలకు వచ్చేసరికి గుర్తు తెలియని దొంగలు 13 తులాల బంగారం, రూ.68 వేలు నగదును అపహరించుకుపోయారు. దీంతో బాధితుడు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. అయితే తాజాగా ఈ సంఘటన మరువకముందే మరో రెండు ఇళ్లల్లో 30 తులాల బంగారం, కొంత మేర డబ్బును ఇలానే దొంగలు ఎత్తుకుపోయారు. ఈసంఘటన శామీర్​పేట పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.

దీంతో కాలనీవాసులు బెంబేలెత్తుతున్నారు. గ్రామపంచాయతీ పరిధిలో 37 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన ప్రస్తుతం వాటిలో కేవలం ఒక్కటంటే ఒక్కటే పనిచేస్తుందని, ఇది దొంగలకు అనుకూలంగా మారడంతో యథేచ్చగా చోరీ చేసుకొని వెళుతున్నారు. తాళం వేసిన ఇళ్లను రోజంతా రిక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడుతున్నారని కాలనీవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా చోరీలు జరుగుతున్న పోలీసులు దృష్టి సారించకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Robbery Incidents in Hyderabad : మరోవైపు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో సైతం ఇవాళ దొంగలు రెచ్చిపోయారు. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడ తాజ్ హోటల్ పక్కన ఇంటి తాళం పగలగొట్టి, దుండగులు బీరువాలో భద్రపరిచిన 16 తులాల బంగారం, 35తులాల వెండి ఆభరణాలు, రూ.లక్ష 40వేల నగదు ఎత్తికెళ్లారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెక్కల కష్టం చేసి ఒక్కొక్క రూపాయి కూడపెట్టుకున్నామని కన్నీరు మున్నీరుగా విలపించారు. దుండగులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని వేడుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ క్లూస్ టీం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

"మేము ఇక్కడ ఒక జ్యూస్​ షాపులో పనిచేస్తున్నాం. రెక్కల కష్టం చేసి ప్రతి రూపాయి కూడబెట్టుకున్నాం. నా భార్య వాళ్ల అమ్మవాళ్లు పెట్టిన బంగారం, మేము కష్టపడి కూడబెట్టుకున్నది కలిపి 16 తులాలు ఉంటుండే, అంతేకాకుండా రూ. 1.40 లక్షలు మొత్తం అపహరణకు గురైంది. ఇంటి తాళం పగలగొట్టి, సంపదంతా ఎత్తుకెళ్లారు."-బాధితుడు

మహిళల వేషధారణలో వచ్చి చోరీ - 4 తులాల బంగారం, రూ.లక్షతో పరార్ - theft in Sr nagar

ఏడాదిలో సగం చోరీలు వేసవిలోనే జరుగుతున్నాయట - మీరు ఎక్కడికైనా వెళ్తే ఇల్లు జాగ్రత్త సుమీ! - Precautions Against Thieves Summer

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.