టీఎస్ఆర్టీసీ(Tsrtc)కి ప్రయాణికులే పరమావధిగా భావిస్తూ... ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(tsrtc md sajjanar) కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికుల నుంచి సూచనలు, సలహాలు, ఆర్టీసీలో ఎదురయ్యే ఇబ్బందులు, సంస్థ అభివృద్దికి సలహాలు, సంస్థ లోపాలపై ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించారు. అందుకోసం ఓ ట్విట్టర్ ఖాతా(Tsrtc twitter)ను ప్రారంభించారు.
ప్రయాణికులు తమ అమూల్యమైన సలహాలను @tsrtcmdoffice (Tsrtc twitter) ట్విట్టర్ ఖాతాలో పంచుకోవాలని సజ్జనార్ సూచించారు. వారి సూచనలతో ఆర్టీసీ(Tsrtc)లో మార్పులు చేర్పులు చేయనున్నట్లు తెలిపారు.
![tsrtc twitter account](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13248890_klahj.jpg)
ఇదీ చదవండి: Rajagopal Reddy: మునుగోడులో అమలు చేస్తే రాజీనామా చేస్తా: రాజగోపాల్ రెడ్డి