ETV Bharat / state

చెక్​ పోస్టులు పరిశీలించిన సీపీ మహేశ్​ భగవత్​

author img

By

Published : May 23, 2021, 3:26 PM IST

rachakonda cp mahesh bhagwat
మహేశ్​ భగవత్​

రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్​, హయత్​నగర్​, పెద్దఅంబర్​పేట, కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్​ ప్లాజా చెక్​పోస్టులను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.

లాక్​డౌన్ నేపథ్యంలో విజయవాడ జాతీయ రహదారిపై... పంతంగి టోల్​ ప్లాజా, కొత్తగూడెం, హయత్​నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్​ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పరిశీలించారు. సిబ్బందికి స్నాక్స్, శానిటైజర్లు అందజేశారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలో నిన్నటి వరకు 35 వేల వాహనదారులపై కేసులు నమోదు చేశామని చెప్పారు. లాక్​డౌన్ నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదన్నారు. పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తూ, శానిటైజర్లు ఉపయోగించాలని సూచించారు.

ఇదీ చదవండి: 100 ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేసిన స్టార్ సింగర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.