ETV Bharat / state

లాక్​డౌన్​ పాటించకుంటే క్రిమినల్​ కేసులు

author img

By

Published : May 12, 2021, 1:57 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాక్​డౌన్​పై ఎస్పీ రాహుల్​ హెగ్డే సూచనలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. అందరూ తప్పనిసరిగా లాక్​డౌన్​ పాటించాలని సూచించారు.

siricilla sp warned people over lockdown restrictions
లాక్​డౌన్​ పాటించకుంటే క్రిమినల్ కేసులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాక్​డౌన్​ అమలు తీరును ఎస్పీ రాహుల్​ హెగ్డే క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ అమలులో ఉంటుందని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్​మెంట్​ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు యధావిధిగా ప్రజారవాణా, అన్ని దుకాణ సముదాయాలు తెరిచి ఉంటాయని వెల్లడించారు. మినహాయింపు ఇచ్చిన సమయంలోనూ భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని, మాస్క్​లు ధరించాలని తెలిపారు. లేకుంటే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.

అన్ని మండల కేంద్రాల్లో పెట్రోలింగ్, ముఖ్య కూడళ్లలో పికెట్స్, చెక్​పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. పెళ్లిళ్లకు 40 మందికి, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి ఉందని వెల్లడించారు. ప్రతి ఒక్కరు లాక్​డౌన్ పాటించాలని, పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.

ఇవీ చదవండి: రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.