ETV Bharat / state

ముస్తాబాద్​లో కాంగ్రెస్ వంటావార్పు

author img

By

Published : Feb 16, 2021, 2:26 PM IST

పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను నిరసిస్తూ ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు వంటావార్పు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై పెనుభారం మోపుతోందని ఆరోపించారు. తక్షణమే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

Congress leaders strike in Mustabad mandal center to protest rising petrol, diesel and cooking gas prices
వంటగ్యాస్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ వంటావార్పు

కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచుతూ సామాన్యులపై పెనుభారం మోపుతోందని కాంగ్రెస్ నేత బాల్ రెడ్డి ఆరోపించారు. నిత్యావసర సరకులు సైతం కొనుగోలు చేయలేని స్థితికి దిగజార్చిందని విమర్శించారు.

పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా తక్షణమే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టొద్దు : ఎన్జీటీ

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.