ETV Bharat / state

విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి.. అండగా ఎమ్మెల్యే

author img

By

Published : Sep 24, 2019, 10:59 PM IST

విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి

పెద్దపల్లి జిల్లా నిట్టూరులో విద్యుదాఘాతంతో మృతి చెందిన రైతుల కుటుంబాలకు అండగా ఉంటామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హామీ ఇచ్చారు.

పెద్దపల్లి జిల్లా నిట్టూరులో విద్యుదాఘాతంతో మృతి చెందిన రైతులు వైకుంఠం, ఓదెలు కుటుంబాలకు అండగా ఉంటామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హామీ ఇచ్చారు. వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న వైకుంఠం, ఓదెలు విద్యుత్ తీగలు తగిలి మరణించడం శోచనీయమన్నారు. రైతుల కుటుంబ సభ్యులు మృతదేహాలతో రాస్తారోకో చేస్తున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే.. అక్కడికి చేరుకొని బాధితులను ఓదార్చారు. అనంతరం ఎస్ఈని పిలిపించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. విద్యుదాఘాతంతో మృతిచెందిన ఒక్కో రైతు కుటుంబానికి రైతుబంధు బీమాతో పాటు విద్యుత్ శాఖ తరఫున రూ.10 లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి విద్యుత్ శాఖలో అవుట్​ సోర్సింగ్ ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన లైన్​మెన్​తో పాటు ఏఈపై సస్పెన్షన్ వేటు వేస్తామన్నారు.

విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి

ఇవీచూడండి: 'ఏకధాటి వర్షంతో రోడ్లన్నీ జలమయం'

Intro:స్లగ్: TG_KRN_42_24_RAITHULA KUTUMBALAKUNMLA BAROSA_AVB_TS10038
రిపోర్టర్: లక్ష్మణ్, 8008573603
సెంటర్: పెద్దపల్లి
యాంకర్: పెద్దపల్లి జిల్లా నిట్టూరు గ్రామంలో విద్యుదాఘాతంతో మృతి చెందిన రైతులు వైకుంఠం, ఓదెలు కుటుంబాలకు అండగా ఉంటామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హామీ ఇచ్చారు. వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న వైకుంఠం, ఓదెలు విద్యుత్ తీగలు తగిలి మరణించడం శోచనీయం అన్నారు. ఇద్దరు రైతుల కుటుంబ సభ్యులు మృత దేహాలతో రహదారిపై రాస్తారోకో చేస్తున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అక్కడికి చేరుకొని బాధితులను ఓదార్చారు. అనంతరం పెద్దపెల్లి జిల్లా విద్యాశాఖ ఎస్ఈ ని పిలిపించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. విద్యుదాఘాతంతో మృతిచెందిన ఒక్కో రైతు కుటుంబానికి రైతుబంధు బీమాతోపాటు విద్యుత్ శాఖ తరఫున పది లక్షల నష్ట పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మృతుల కుటుంబాల్లో ఒకరికి విద్యుత్ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యాశాఖ లైన్ మెన్ తో పాటు ఏఈ పై సస్పెన్షన్ వేటు కూడా చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.
బైట్ దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే


Body:లక్ష్మణ్


Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.