ETV Bharat / state

వసతిగృహాల్లో సమస్యల పరిష్కారానికై విద్యార్థినుల నిరసన

author img

By

Published : Nov 4, 2019, 5:59 PM IST

వసతిగృహాల్లో సమస్యల పరిష్కారం కోరుతూ విద్యార్థినుల నిరసన

గిరిరాజ్​ కాలేజీ ఆవరణలోని ఎస్టీ బాలికల వసతి గృహాల్లో సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ పీడీఎస్​యూ ఆధ్వర్యంలో కలెక్టరేట్​ వద్ద విద్యార్థులు నిరసన తెలిపారు. విద్యార్థినుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ నినదించారు.

వసతిగృహాల్లో సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ గిరిరాజ్​ కళాశాల ఆవణలో ఉన్న కళాశాల ఎస్టీ వసతిగృహం విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. పీడీఎస్​యూ ఆధ్వర్యంలో నిజామాబాద్​ కలెక్టరేట్​ ముందు ధర్నా చేపట్టారు. విద్యార్థినులు ఇబ్బంది పెడుతున్న వార్డెన్​పై చర్యలు తీసుకోవాలని... భోజనం, వసతి సౌకర్యాల్లో సమస్యలు పరిష్కరించాలని నినదించారు. తమ డిమాండ్లు నెరవేరని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

వసతిగృహాల్లో సమస్యల పరిష్కారం కోరుతూ విద్యార్థినుల నిరసన
ఇదీ చూడండి: వాటర్​ ట్యాంక్​ ఎక్కి నిరసన తెలిపిన.. వార్డు సభ్యులు
sample description

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.