ETV Bharat / state

శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద.. 16 గేట్లు ఎత్తివేత

author img

By

Published : Oct 1, 2020, 12:28 PM IST

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్​కు వరద ప్రవాహం తిరిగి కొనసాగుతోంది. ఎస్సారెస్పీ 16 గేట్లు ఎత్తి 75,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు.

srsp 16 gates have opened
శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద.. 16గేట్లు ఎత్తివేత

నిజామాబాద్​ జిల్లాలోని శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు ఇన్​ఫ్లో లేకపోవడం వల్ల ప్రాజెక్టు గేట్లను బుధవారం మూసివేశారు. అయితే సాయంత్రం తిరిగి స్వల్ప వరద ప్రవాహం ఉడడంతో 4 గేట్లను ఎత్తి 12,500 క్యూసెక్కుల నీటిని అధికారులు గోదావరిలోకి విడుదల చేశారు.

వాననీటి ఉద్ధృతి అధికంగా ఉండడం వల్ల ఇవాళ ఇన్​ఫ్లో 86,973 క్యూసెక్కులకు పెరిగింది. వరద ప్రవాహాన్ని గమనించిన అధికారులు జలాశయం 16 గేట్లను ఎత్తి 75,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు.

ఇదీ చూడండి: సాగర్​ 10 క్రస్ట్​ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.