ETV Bharat / state

'ఉగ్రవాదానికి అడ్డాగా నిజామాబాద్​': ఎంపీ అర్వింద్​

author img

By

Published : Oct 12, 2022, 3:06 PM IST

Updated : Oct 12, 2022, 3:26 PM IST

MP Dharmapuri Arvind
MP Dharmapuri Arvind

MP Arvind sensational comments: ఉగ్రవాదానికి అడ్డాగా నిజామాబాద్​ మారిందని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్​ ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిందని.. సంవత్సరం కిందటే తాను పార్లమెంట్​లో ప్రస్తావించానని ఆయన తెలిపారు. కేసీఆర్​ బతికున్నంతకాలం భారత్​ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా మార్చలేరని ఆయన పేర్కొన్నారు. మునుగోడులో తెరాస, భాజపాల మధ్యనే పోటీ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

MP Arvind sensational comments: ఉగ్రవాదానికి అడ్డాగా నిజామాబాద్​ మారిందని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్​ ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఇదే విషయం సంవత్సరం కిందటే తాను పార్లమెంట్​లో ప్రస్తావించినట్లు ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పీఎఫ్​ఐ కార్యకర్తలను కేంద్ర దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారని.. అందులో నిజామాబాద్​ పట్టణానికి చెందిన కొందర్ని అరెస్టు చేశారని ఆయన తెలిపారు. సంవత్సరం కిందట నిజామాబాద్​లో కొందరికి దొంగ పాస్​పోర్టులు ఇచ్చారని ఆయన ఆరోపణలు చేశారు.

బోధన్​ నుంచి ఒకే చిరునామాతో అనేక పాస్​పోర్టులు ఇచ్చారని.. ఇందులో తెరాస, ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయం అమిత్​షా, డీజీపీ మహేందర్​రెడ్డికి ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎన్​ఐఏ అధికారులు వచ్చి దర్యాప్తు చేయాలని ఆయన సూచించారు. భారత్​ రాష్ట్ర సమితి పేరుతో తెరాస దేశం మ్యాప్​ మార్చారని అన్నారు.

కేసీఆర్​ బతికున్నంత వరకు తెరాస జాతీయపార్టీ మారదని అభిప్రాయపడ్డారు. కవితను భారత్ రాష్ట్ర సమితిలో క్రియాశీలకంగా ఉంచాలని తాను కోరుకుంటున్నాని హెద్దేవా చేశారు. మునుగోడులో తెరాస, భాజపాల మధ్యనే పోటీ ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ పాక్​ అక్రమిత ప్రాంతంలో పాదయాత్ర చేయాలని ఆయన అన్నారు. తెలంగాణకు కేంద్రం 17 ఇథనాల్ ఫ్యాక్టరీలు ఇచ్చినా కేసీఆర్​ ప్రారంభించలేదని ఆయన అన్నారు.

"ఉగ్రవాదానికి అడ్డాగా నిజామాబాద్​ మారింది. దేశవ్యాప్తంగా పీఎఫ్​ఐ కార్యకర్తలను కేంద్ర దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు. అందులో నిజామాబాద్​ పట్టణానికి చెందిన కొందర్ని అరెస్టు చేశారు. సంవత్సరం కిందట నిజామాబాద్​లో దొంగ పాస్​పోర్టులు ఇచ్చారు. ఈ వ్యవహారంలో తెరాస, ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కేసీఆర్​ బతికున్నంత వరకు తెరాస జాతీయపార్టీ మారదు. మునుగోడులో తెరాస, భాజపాల మధ్యనే పోటీ ఉంటుంది. రాహుల్​ గాంధీ పాక్​ అక్రమిత ప్రాంతంలో పాదయాత్ర చేయాలి".- అర్వింద్​ ఎంపీ

'ఉగ్రవాదానికి అడ్డాగా నిజామాబాద్​ మారింది'.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ అర్వింద్​

ఇవీ చదవండి:

Last Updated :Oct 12, 2022, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.