ETV Bharat / state

నిరాడంబరంగా వినాయక నిమజ్జనోత్సవం

author img

By

Published : Sep 1, 2020, 7:22 PM IST

Ganesha immersion festival at nizamabad started by mla ganesh Gupta
నిజామాబాద్​లో నిరాడంబరంగానే వినాయకుని నిమజ్జనోత్సవం

కొవిడ్​ వ్యాప్తి నేపథ్యంలో నిజామాబాద్​ నగరంలో ఈ ఏడాది నిరాడంబరంగానే వినాయకుని శోభాయాత్ర నిర్వహించారు. నిజామాబాద్​ అర్బన్​ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా ప్రారంభించగా.. సాయంత్రం ఐదు గంటల లోపే వినాయకుని విగ్రహాల నిమజ్జనం పూర్తయింది.

నిజామాబాద్​ నగరంలో గణేశుని నిమజ్జనాలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. కరోనా కారణంగా నిరాడంబరంగానే ఈ ఏడాది వినాయకుని శోభాయాత్ర నిర్వహించారు. నగరంలోని దుబ్బ చౌరస్తా నుంచి సార్వజనిక్ గణేశ్​ మండలి ఆధ్వర్యంలో శోభాయాత్ర ప్రారంభం కాగా వినాయకుల బావి వరకు శోభాయాత్ర ఘనంగా జరిగింది.

శోభాయాత్రను నిజామాబాద్​ అర్బన్​ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా ప్రారంభించగా.. సాయంత్రం ఐదు గంటల లోపే వినాయకుని విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. నగరవ్యాప్తంగా ఈ ఏడాది.. ఎక్కువ శాతం ఐదు అడుగుల లోపున్న విగ్రహాలనే అధికంగా ప్రతిష్ఠించారు. ఐదు అడుగులకు మించి ఉన్న విగ్రహాలను నిర్మల్​ జిల్లా బాసర వద్దనున్న గోదావరిలోనే నిమజ్జనం చేశారు.

ఇదీ చూడండి:- యుద్ధాన్ని మించేలా భారత దళాల మంచు 'ప్రయాణం'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.