ETV Bharat / state

అనుబంధాలను సమాధి చేసిన కుమారుడు, తల్లిని శ్మశానంలో వదిలేశాడు

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2023, 4:42 PM IST

60 Years old Women Injured attack by Son
Son Left Mother Graveyard at Water Tank Thanda

Son Left His Mother in the Graveyard in Nalgonda : చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచి.. విద్యాబుద్దులు నేర్పించిన తల్లిని శ్మశానంలో వదిలేశాడో ప్రబుద్ధుడు. వారు ఉంటున్న చోటే వదిలిస్తే.. అందరికి తెలుస్తుందని... రాష్ట్రం నుంచి తీసుకుని వచ్చి తెలంగాణలో చేతులు విరిచేసి శ్మశానవాటికలో వదిలేశాడు. గుండెల్ని పిండేసే ఈ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. కన్నీళ్లు పెట్టించే ఆ తల్లి హృదయ విదారకరమైన కథ తెలుసుకుందాం..!

Son Left His Mother in the Graveyard in Nalgonda : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామానికి చెందిన వెంకటరత్నమ్మ(70)కు కుమారుడు వెంకటేశ్​, ఓ కుమార్తె ఉన్నారు. ఆమె భర్త పేరు ఏడుకొండలు. శనివారం కుమారుడు, కోడలు కలిసి వృద్దురాలి చేయి విరగొట్టి(Son Beat His Mother).. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలం వాటర్​ట్యాంక్​ తండాలో ఉన్న శ్మశానవాటికలో విడిచిపెట్టి వెళ్లారు.

A Girl Killed her Mother Along With Boyfriend: దత్త పుత్రిక దాష్టీకం.. ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన బాలిక

Son Beat His Mother in Guntur : ఇవాళ పంచాయతీ కార్మికుడు విధినిర్వహణలో భాగంగా మొక్కలకు నీరు వేసేందుకు స్వర్గధామానికి వెళ్లాడు. అనంతరం అక్కడే కొన ఊపిరితో బతికి ఉన్న ఆ వృద్దురాలిని చూసి.. గ్రామ సర్పంచ్​కు తెలిపాడు. వెంటనే సర్పంచ్​ ఆ ప్రదేశానికి వెళ్లి.. ఆమెకు ఆల్పాహారం ఇచ్చి ఆకలి తీర్చాడు. తర్వాత ఆమెను వైకుంఠ ధామం పక్కనే ఉన్న కంపోర్టు షెడ్​ దగ్గరకు తీసుకువెళ్లి వివరాలు సేకరించారు.

old Women Tragedy Story in Nalgonda : సర్పంచ్​, గ్రామస్థులు వృద్దురాలు శ్మశానవాటికలో గాయాలతో ఉన్న విషయాన్ని పోలీసులుకు తెలిపారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకుని ఆమె పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఇంటికి వెళితే తమ కుమారుడు, కోడలు చంపేస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆస్పత్రికి తీసుకు వెళ్లమని వేడుకొని కన్నీటి పర్యంతమైంది(Mother Tragedy Story in Nalgonda). మరింత సమాచారాన్ని ఆమె బ్యాగ్​లో ఉన్న ఆధార్​ కార్డు, రేషన్​కార్డు ద్వారా సేకరించారు. అనంతరం చికిత్స కోసం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారాన్ని దాచేపల్లి పోలీసులకు చేరవేశామని పోలీసులు తెలిపారు. వృద్దురాలి భర్త బతికే ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు.

"వాటర్ ట్యాంక్​ తండాకు చెందిన సర్పంచ్​ ఓ వృద్దురాలు శ్మశానవాటికలో ఎవరో వదిలేసి వెళ్లారని సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నాను. ఆ వృద్దురాలిని వివరాలు అడిగితే.. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం అని చెప్పింది. దీంతో ఆమె సమాచారం కోసం దాచేపల్లి పోలీస్​ స్టేషన్​కు తెలియజేశాం. ఆమెను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించాం."- ఉమాపతి, ఏఎస్ఐ

Son Left His Mother in the Graveyard in Nalgond శ్మశానంలో బంధాలను సమాధి చేసిన కుమారుడు

పెన్షన్​ కోసం దివ్యాంగురాలి అవస్థలు.. భర్త, కుమారుడు కలిసి కావడితో కి.మీల నడక..

Viral Video Nagarkurnool Mother Selfie Video : 'బిడ్డా నేను బతికే ఉన్నా..' ఆస్తి కోసం తల్లి చనిపోయినట్లు కుమారుడి ఫ్లెక్సీలు.. సెల్ఫీ వీడియోతో బట్టబయలు

A Man Meets Parents After 20 years : చిన్నతనంలో తప్పిపోయి.. చివరికి 20 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.