ETV Bharat / state

మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతిపై మార్ఫింగ్​​ ఫోటోలతో హల్​చల్​..!

author img

By

Published : Nov 3, 2022, 2:49 PM IST

Updated : Nov 3, 2022, 3:52 PM IST

Palvai Sravanti Morphing Photos: మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతిపై మార్ఫింగ్‌ ఫోటోలతో కొన్ని ఛానళ్లు, సామాజిక మాద్యమాలల్లో దుష్ప్రచారం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. దుబ్బాక తరహాలోనే మునుగోడులో కూడా భాజపా సోషల్ మీడియాలో బరితెగించిందని విమర్శించారు.

పాల్వాయి స్రవంతిపై మార్ఫింగ్​ ఫోటోలతో హల్​చల్​..!
పాల్వాయి స్రవంతిపై మార్ఫింగ్​ ఫోటోలతో హల్​చల్​..!

Palvai Sravanti Morphing Photos: తమ ఓటమి ఖాయమన్న భయం ఉన్న వాళ్లే ఇలాంటి నీచానికి దిగజారుతారని ట్విట్టర్‌ ద్వారా మండిపడ్డారు. మరొక పక్క పాల్వాయి స్రవంతి కూడా ఈ విషయమై స్పందించారు. ఓ ఛానల్‌ వారు తమపై తప్పుడు సమాచారాన్ని ప్రచురించారని.. వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆమె స్పష్టం చేశారు. తనపై ఓ భానల్‌లో వచ్చిన తప్పుడు వార్త ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

  • దుబ్బాక తరహాలోనే మునుగోడులో ఫేక్ పార్టీ (బీజేపీ) సోషల్ మీడియాలో బరితెగించింది.

    కాంగ్రెస్ అభ్యర్థి, మునుగోడు ఆడబిడ్డ స్రవంతిపై మార్పింగ్ ఫోటోలతో దుష్ఫ్రచారం చేస్తోంది. తమ ఓటమి ఖాయం అన్న భయం ఉన్న వాళ్లే ఇలాంటి నీచానికి దిగజారుతారు#ManaMunugodeManaCongress #MunugodeWithCongress

    — Revanth Reddy (@revanth_anumula) November 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన ఫోటోను.. మార్ఫింగ్‌ చేసి ఆ ఫోటోతో.. ఫేక్‌ ఫోటో క్రియేట్‌చేసి కేసీఆర్​ను కలిసినట్లు ప్రచురించారని ఆరోపించారు. తాను విలువలతో కూడిన నాయకురాలినని.. తన తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఇప్పటి వరకు తాను కేసీఆర్​ను కలువలేదని ఆమె స్పష్టం చేశారు.

పాల్వాయి స్రవంతిపై మార్ఫింగ్​ ఫోటోలతో హల్​చల్​..!

'దమ్ము ధైర్యం ఉంటే నాతో నేరుగా పోటిపడి గెలవాలి కానీ నా ఫోటోలు మార్ఫింగ్​ చేయడం ఏంటి? దుబ్బాకలో మాదిరిగానే మునుగోడులో భాజపా తప్పుడు ప్రచారం చేస్తోంది. ఆ తప్పుడు సమాచారాన్ని ఓ ప్రైవేట్​ ఛానల్​ తెలుసుకోకుండా ప్రచారం చేయడం ద్వారా నా పరువుకు నష్టం కలిగింది. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడానికి ఆ సంస్థ ఎంత దిగజారిపోయింది. నా పరువుకు నష్టం కలిగించే విధంగా వార్తలు ప్రచారం చేసినందుకు ఆ ప్రైవేట్​ ఛానల్​పై పరువు నష్టం దావా వేస్తాను'.-పాల్వాయి స్రవంతి, మునుగోడు కాంగ్రెస్​ అభ్యర్థి

ఇవీ చదవండి:

Last Updated : Nov 3, 2022, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.