ETV Bharat / state

బోగత జలపాతం వద్ద మృతదేహం లభ్యం

author img

By

Published : Sep 1, 2020, 11:18 AM IST

ములుగు జిల్లా వాజేడు మండలం బోగత జలపాతం వద్ద మృతదేహం లభ్యమైంది. మూడు రోజుల క్రితం గల్లంతైన యువకుడిగా గుర్తించారు.

dead body found at bogatha waterfall in mulugu district
బోగత జలపాతం వద్ద మృతదేహం లభ్యం

ములుగు జిల్లా వాజేడు మండలం బోగత జలపాతంలో స్నానం చేస్తూ గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. హన్మకొండకు చెందిన సాఫ్ట్​వేర్ ఉద్యోగి గోపీచంద్​గా గుర్తించారు.

ఆదివారం.. హైదరాబాద్​కు చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి గోపీచంద్​.. జలపాతం వద్దకు వెళ్లారు. జలపాతం వద్దకు వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో మరోమార్గం నుంచి ప్రవేశించారు. స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. అక్కడ వరద ప్రవాహంతో నీటి కొలను కింది ప్రాంతానికి కొట్టుకుపోయారు. మత్య్సకారుల గాలించి మృతదేహాన్ని గుర్తించారు.

ఇవీచూడండి : ఫేస్​బుక్​లో ప్రేమించాడు.. పెళ్లి పేరుతో కిరాతకంగా చంపేశాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.