ETV Bharat / state

Shamirpet Gun Firing Update: 'శామీర్​పేట్'​ కాల్పుల ఘటన.. నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

author img

By

Published : Jul 16, 2023, 7:47 PM IST

Shamirpet Gun Fire Incident Latest Update : మేడ్చల్​ జిల్లాలోని శామీర్​పేట్​ సెలబ్రీటీ విల్లాలో కాల్పుల ఘటనలో నిందితుడిగా ఉన్న మనోజ్​ కుమార్​కు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్​ విధించింది. దీంతో పోలీసులు అతడిని చంచల్​గూడ జైలుకు తరలించారు.

Manoj Kumar Gun Fire Incident Update
Manoj Kumar Gun Fire Incident Update

Gun Fire Incident at Shamirpet Update News : మేడ్చల్‌ జిల్లా శామీర్​పేట్​ సెలబ్రిటీ విల్లాలో కాల్పులు జరిపిన కేసులో నిందితుడిగా ఉన్న మనోజ్​కు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతడిని చంచల్​గూడ జైలు​కు తరలించారు. అంతకుముందు మనోజ్​కు వైద్య పరీక్షలు నిర్వహించి అల్వాల్‌లో జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. ఆయన ఆదేశాల మేరకు.. నిందితుడిపై పోలీసులు ఆర్మ్స్ యాక్ట్​ కింద కేసు నమోదు చేసి.. చంచల్​గూడ జైలుకు తీసుకెళ్లారు. సిద్ధార్థ దాస్​పై కాల్పులు జరిపిన ఎయిర్ తుపాకీని ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపించారు. స్మితతో సహజీవనం చేస్తున్న మనోజ్​ కుమార్​ తమను వేధిస్తున్నారని ఆమె కుమారుడు మేడ్చల్​- మల్కాజ్​గిరి జిల్లా బాలల సంరక్షమ కమిటీకి జూన్​ 12న ఫిర్యాదు చేశాడని పోలీసులు వివరించారు.

Manoj Kumar and smitha Gun Fire Case : ఆ ఫిర్యాదులో తన తల్లి తరుఫు బందువుల దగ్గర కూడా ఆ పిల్లలు ఇద్దరు ఉండలేరని పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన సీడబ్ల్యూసీ అధికారులు బాలుడిని రక్షించి.. సంరక్షణా గృహానికి తరలించారని పోలీసులు తెలిపారు. కుమార్తెతో సహా మేడ్చల్​- మల్కాజ్​గిరి జిల్లా బాలల సంరక్షణ కార్యాలయానికి ఈ నెల 18న విచారణకు రావాలని సీడబ్ల్యూసీ అధికారులు స్మితకు నోటీసులు ఇచ్చారు.

Manoj kumar Clarity on Shamirpet Incident : కాల్పులు జరిపింది నేను కాదు: కార్తీకదీపం ఫేమ్ మనోజ్ కుమార్​

అసలు ఏమి జరిగిందంటే .. : సిద్ధార్థదాస్‌.. భార్య స్మితతో 2019లో విడిపోయాడు. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. స్మిత శామీర్‌పేట్‌లోని విల్లా నంబరు 21లో మనోజ్‌కుమార్‌ అనే వ్యక్తితో కొంత కాలంగా సహజీవనం చేస్తోంది. శనివారం సిద్ధార్థ తన పిల్లలను చూసేందుకు విల్లా వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో స్మితతో విల్లా దగ్గర గొడవపడ్డాడు. దీంతో అక్కడే ఉన్న మనోజ్‌ కుమార్‌ ఆగ్రహానికి గురయ్యాడు. ఆ గొడవలో భాగంగా ఎయిర్‌గన్‌తో సిద్ధార్థపై మనోజ్​ కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన అతడు అక్కడి నుంచి తప్పించుకుని శామీర్‌పేట్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఆ కేసుతో నాకేం సంబంధం లేదు : ఈ ఘటన జరిగిన అనంతరం ఈ కేసులో నిందితుడుగా టీవీ సీరియల్ కార్తీక దీపం కథానాయకుడు మనోజ్​ కుమార్​ అనుకొని కొన్ని మీడియా ఛానల్స్​ ప్రచారం చేశాయి. ఆ విషయం అతను తెలుసుకుని స్పందించారు. ఆ మనోజ్​ కుమార్​ తాను కాదని.. ఆ కేసుకి తనకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటానని.. ఓ వీడియో రూపంలో తెలియజేశారు. తాను బెంగళూరులో ఉన్నారని ఆ వీడియోలో చెప్పారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.