కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన భార్య రమాదేవితో కలిసి ఇటీవల అమెరికా పర్యటన ముగించుకున్నారు. ఈ మేరకు మార్చి 15న స్వదేశానికి తరలివచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో అనుమానితులు, విదేశాల నుంచి వచ్చే వారికి సంబంధించి ప్రత్యేక అదేశాలు జారీ చేశాయి.
ఇతర దేశాల నుంచి భారత్కు వచ్చిన వారిని 14 రోజుల పాటు స్వీయ గృహ నిర్భందంలో ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా వైద్యాధికారి ఎమ్మెల్యే కోనప్పకు ప్రభుత్వం తరఫున ఆదేశాలను జారీ చేశారు. రెండు వారాల పాటు ఇంటిని విడిచి బయటకు వెళ్లరాదని... జనానికి దూరంగా ఉండాలని సూచించారు.
![14 రోజులు క్వారంటైన్గా ఎమ్మెల్యే కోనప్ప దంపతులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6483521_mla.jpg)