ETV Bharat / state

జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

author img

By

Published : Feb 12, 2021, 7:55 PM IST

అయిదో శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈరోజు నుంచి 5 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. భక్తుల తాకిడితో ఆలయ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.

Annual Brahmotsavams started at jogulamba temple
జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్​లో జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయం నుంచి పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు తీసుకోని ఆలయ ఈఓ ప్రేమ్ కుమార్, ఛైర్మన్ రవి గౌడ్ అర్చకులతో కలిసి ఊరేగింపుగా వెళ్లి.. బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆనతి స్వీకరణ నిర్వహించారు.

అమ్మవారి ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహ వచనం, ఋత్విక్ వరణం, మహా కలశ స్థాపన కార్యక్రమాలు చేశారు. సాయంత్రం గం.6:00లకు ధ్వజారోహణం నిర్వహించారు. ఈరోజు నుంచి 5 రోజులపాటు విశేష పూజలు.. హోమాలు, బలిహరణం మొదలగు కార్యక్రమాలు జరుగుతాయి. చివరి రోజైన వసంత పంచమి నాడు... అమ్మవారు భక్తులకు విశ్వరూప దర్శనమిస్తారు

ఇదీ చూడండి: తెరాస సభ్యత్వాలు కోటికి చేరాలి: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.