ETV Bharat / state

కొడిమ్యాలలో పాక్షిక లాక్​డౌన్​ విధిస్తూ నిర్ణయం

author img

By

Published : Apr 16, 2021, 3:33 AM IST

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని... చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ తెలిపారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో పాక్షిక లాక్​ డౌన్​ విధిస్తూ మండల పరిషత్​ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

Decision to impose partial lock down on Kodimyala in Jagitial district
కొడిమ్యాలలో పాక్షిక లాక్​డౌన్​ విధిస్తూ నిర్ణయం

కొవిడ్​ కేసుల పెరుగుదలను మామూలు విషయంగా తీసుకోవద్దని... చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ అన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని తెలిపారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల పరిషత్​ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వారం రోజులుగా మండల పరిధిలో కరోనా కేసులు పెరగటంతో పాక్షిక లాక్​డౌన్​ విధించాలని నిర్ణయించారు.

మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించుకోవాలని ప్రకటించారు. లాక్​డౌన్ ఉల్లంఘించిన వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నట్లు వెల్లడించారు. హోటళ్లలో రద్దీ తగ్గించేందుకు పార్శిల్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. దుకాణాల యజమానులు కరోనా రెండో దశ విజృంభిస్తున్న క్రమంలో స్వచ్ఛందంగా దుకాణాలు మూసి వేస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి: చిన్నారుల అదృశ్యంపై పూర్తి వివరాలు సమర్పించండి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.