ETV Bharat / state

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. శ్రీవారి సేవలో ప్రముఖులు

author img

By

Published : Dec 25, 2020, 9:21 AM IST

vaikunta-dwara-darshan-at-tirumala-temple
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. వేకువ జామున 3.30 గంటల నుంచి ప్రముఖుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. సుమారు 3వేల మంది ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండువగా సాగుతున్నాయి. అర్ధరాత్రి తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారం తెరిచారు. అభిషేకం, అర్చన, అలంకరణ అనంతరం ఉత్తర ద్వారం ద్వారా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే సహా పలువురు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్‌ గౌడ్‌, మల్లారెడ్డి, ఏపీ మంత్రులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సుమారు 3 వేలమంది ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనానికి హాజరయ్యారు.

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. శ్రీవారి సేవలో ప్రముఖులు

కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. జనవరి 3 వరకు ముక్కోటి ఏకాదశి వేడుకలు జరగనున్నాయి. పదిరోజుల పాటు టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు చేశారు. సాధారణ భక్తులకు గంటన్నర ముందే వైకుంఠద్వార దర్శనం ప్రారంభించిన్నట్లు అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటలకు అనుకున్నామని కానీ.. 7.30 గంటలకే ప్రారంభినట్లు తెలిపారు. పరిస్థితిని అంచనా వేసి ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం టిక్కెట్ల పెంచామన్నారు.

సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించగలుగుతున్నామని ఈవో పేర్కొన్నారు. ప్రముఖులు సహకరించడంతో సాధారణ భక్తులకు ఎక్కువ సమయం స్వామివారిని దర్శించుకుంటున్నట్లు వివరించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో వెయ్యి చొప్పున టికెట్లు జారీ చేశామన్నారు. దాతలకు 2 వేల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు కేటాయించామని తెలిపారు. ప్రముఖులు, అత్యంత ప్రముఖులు 3 వేలమంది స్వామివారిని దర్శించుకున్నారని అన్నారు. దాదాపు 7 వేలమందికి ఏకాదశి విరామ సమయ దర్శనం కల్పించామని అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖుల వివరాలు

  • సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌.ఎ.బోబ్డే
  • కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
  • తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్‌ గౌడ్‌, మల్లారెడ్డి
  • ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్‌ కుమార్
  • ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్‌
  • ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటరమణ
  • ఏపీఈఆర్‌సీ ఛైర్మన్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి
  • ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి సురేష్‌
  • ఏపీ సీఎస్‌గా ఎంపికైన ఆదిత్యనాథ్‌ దాస్‌
  • ఏపీ ఉన్నత విద్య రెగ్యులేషన్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య
  • రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.