ETV Bharat / state

KRMB MEET: త్వరలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ.. నీటివాటాలపై చర్చ

author img

By

Published : Jan 22, 2022, 5:25 AM IST

KRMB MEET
కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ

KRMB MEET: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ వచ్చే వారం సమావేశం కానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యాసంగి సీజన్ సాగునీటితో పాటు తాగునీటి అవసరాల కోసం నీటి విడుదల అంశంపై సమావేశంలో చర్చించనుంది.

KRMB MEET: యాసంగి సీజన్​లో తెలుగు రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాసలపై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ వచ్చేవారంలో భేటీ కానుంది. ఈ నేపథ్యంలో రబీ సీజన్ సాగు, తాగునీటి అవసరాలకు సంబంధించిన వివరాలు పంపాలని రెండు రాష్ట్రాలను కృష్ణా బోర్డు కోరింది.

letters to ENCS: ఈ నెల 24వ తేదీ వరకు వివరాలు ఇవ్వాలని కోరుతూ కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి రాయిపురే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీలకు ఇప్పటికే లేఖలు రాశారు. రెండు రాష్ట్రాల నుంచి వివరాలు అందాక తేదీ ఖరారు చేసి త్రిసభ్య కమిటీ సమావేశమవుతుందని తెలిపారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.