ETV Bharat / state

గవర్నర్​ను గుర్తించని సీఎంకు సీటులో కూర్చునే అర్హత లేదు: ఎంపీ అర్వింద్​

author img

By

Published : Mar 1, 2022, 5:57 PM IST

ARVIND COMMENTS ON CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహిళలపై ఉన్న చిన్నచూపును రాష్ట్ర ప్రథమ పౌరురాలైన గవర్నర్ ​పైన చూపిస్తున్నారని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మండిపడ్డారు. అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగం ప్రకారమే మనమందరం నడుచుకోవాల్సి ఉంటుంది.. కానీ సీఎం సొంత రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటున్నారని విమర్శించారు. గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు ఎలా ప్రారంభిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

BJP MP Dharmapuri Arvind speaking
మాట్లాడుతున్న భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌

ARVIND COMMENTS ON CM KCR: తెలంగాణ ప్రథమ పౌరురాలైన గవర్నర్​ను కేసీఆర్ ​చిన్నచూపు చూపిస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆక్షేపించారు. తెరాస అధికారంలోకి వచ్చిన తొలిసారి మంత్రివర్గంలో ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఇక రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆరునెలల పాటు మంత్రివర్గ విస్తరణ చేయలేదని పేర్కొన్నారు. బడ్జెట్​ను మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంటుంది. కాబట్టి బడ్జెట్ సమావేశాల ముందే క్యాబినెట్​ను విస్తరించారని తెలిపారు.

చట్ట సభల నిర్వహణకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. ఆర్టికల్ 176 ప్రకారం రాష్ట్ర గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాతనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకావాలని గుర్తు చేశారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తున్నారు.

ప్రకాశ్ రాజ్, కేసీఆర్ దోస్తానా చూస్తుంటేనే వాళ్ల ఉద్దేశం అర్థమవుతోంది. దేశం ముక్కలు కావాలే అన్న భావజాలం ఉన్న జిగ్నేష్ మేవానీ బృందాన్ని ముందు నుంచి ప్రకాశ్ రాజ్ సమర్ధిస్తున్నాడు. సీఎం కేసీఆర్​కు భారతదేశం ఐక్యంగా కాకుండా చిన్న చిన్న రాజ్యాలుగా మారాలని కోరుకుంటున్నారు. అందుకే ఇద్దరు కలిసి దేశమంతా తిరిగి ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశాలు పెడుతున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్​ను గుర్తించనప్పుడు, ఆయన సీఎం సీటులో ఒక్క నిమిషం కూర్చునే అర్హత లేదు.

- భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌

ఇదీ చదవండి: Bandi sanjay letter to KCR: 'కౌలు రైతుల పట్ల తెరాస ప్రభుత్వం వివక్ష చూపుతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.