ETV Bharat / state

'నిజాం కళాశాల విద్యార్థుల సమస్యను వెంటనే పరిష్కరించాలి'

author img

By

Published : Nov 14, 2022, 7:43 PM IST

Nizam College Students Protest updates
Nizam College Students Protest updates

Nizam College Students Protest Updates: నిజాం కళాశాలలో హాస్టల్ సౌకర్యం కోసం యూజీ విద్యార్థులు చేస్తున్న పోరాటం కొనసాగుతోంది. విద్యార్థుల ఆందోళనకు ఆర్​ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, విమలక్క, బల్మూరి వెంకట్‌ సంఘీభావం ప్రకటించారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

'నిజాం కళాశాల విద్యార్థుల సమస్యను వెంటనే పరిష్కరించాలి'

Nizam College Students Protest Updates: హైదరాబాద్​ నిజాం కళాశాల యూజీ విద్యార్థులు తమకు హాస్టల్ కేటాయించాలని ఆందోళను చేస్తున్న విషయం తెలిసిందే. వారు చేస్తున్న నిరసనకు పలువురు రాజకీయ, విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. 130 ఏళ్ల చరిత్ర గల కళాశాలలో విద్యార్థులకు ఇలాంటి ఇబ్బంది రావడం బాధాకరమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్​ఎస్​ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. విద్యార్థులకు వెంటనే హాస్టల్‌ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తెలంగాణ రాష్ట్రం కోసం అన్నీ యూనివర్శిటీల విద్యార్థులు ఉద్యమం చేస్తేనే.. తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుచేసుకోవాలని ప్రవీణ్‌ కుమార్‌ హితవు పలికారు. విద్యార్థులకు కొత్తగా మరో హాస్టల్​ను నిర్మించడానికి రూ.5కోట్లు ఖర్చు అవుతోందని.. ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించలేని పరిస్థితిలో ఉందా అని ప్రశ్నించారు. కానీ ప్రగతిభవన్ కట్టడానికి రూ.177 కోట్లు ఖర్చు పెట్టారని ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు.

ఆ పది కోట్లతోనే రెండు హాస్టల్స్​ను నిర్మించవచ్చు: ప్రభుత్వం నూతన సచివాలయం కోసం రూ.1200 కోట్లకు పైగా ఖర్చు పెడుతుందని ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. మంత్రి కేటీఆర్ దావోస్​ పర్యటన కోసం రూ.10 కోట్లు ఖర్చు పెట్టారని.. ఆ పది కోట్లతోనే రెండు హాస్టల్స్​ను నిర్మించవచ్చని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్తగా కట్టిన హాస్టల్​ను యూజీ విద్యార్థులకు కేటాయించాలని.. అదేవిధంగా మరో కొత్త హాస్టల్​ను నిర్మించి పీజీ విద్యార్థులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకూ కళాశాలలోనే విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలపాలని ఆర్​ఎస్​ ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు .

మరోవైపు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకురాలు విమలక్క, ఎన్ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ విద్యార్థుల నిరసనకు సంఘీభావం తెలిపారు. ఈ విషయంపై బయట పోరాటాన్ని తాము ఉద్ధృతం చేస్తామని విద్యార్థి సంఘాల నాయకులు వారికి భరోసా ఇచ్చారు.

"తరగతి గదిలో వారి భవిష్యత్​ను తీర్చిదిద్దుకోవాల్సిన విద్యార్థులు తెలంగాణలో ఇప్పుడు చెట్ల కింద ధర్నాలు చేస్తున్నారు. అన్నం తినకుండా నిరసన చేపట్టారు. వారి పోరాటం ప్రగతిభవన్​లో సీటు కోసం కాదు. విద్యార్థులు కేవలం తమకు హాస్టల్ కేటాయింంచాలని అడిగారు. దాన్ని కూడా పాలకులు పట్టించుకోలేదు. నిజాం కళాశాల, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు లేకపోతే తెలంగాణ వచ్చేదా. ఇది ప్రగతిభవన్​లో ఉన్న పాలకులు గుర్తించాలి." - ఆర్​ఎస్​ ప్రవీణ్‌ కుమార్‌ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి: 'పోరాటం మేం చేస్తే.. సీట్లు వారికెలా ఇస్తారు..'

'కేటీఆర్‌ చెప్పినా.. అధికారులు స్పందించడం లేదు'

దిల్లీ మద్యం కుంభకోణం కేసు... ఆ ఇద్దరికి బెయిల్

మత మార్పిళ్లపై సుప్రీం హెచ్చరిక.. రంగంలోకి దిగాలని కేంద్రానికి ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.