ETV Bharat / state

'పోరాటం మేం చేస్తే.. సీట్లు వారికెలా ఇస్తారు..'

author img

By

Published : Nov 12, 2022, 9:34 PM IST

హైదరాబాద్ నిజాం కళాశాలలో హాస్టల్ సౌకర్యం కోసం యూజీ విద్యార్థులు చేస్తున్న పోరాటం కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్ నిజాం కాలేజీకి వచ్చినప్పుడు తమ సమస్యను గుర్తించి రూ.5 కోట్లు కేటాయించారని.. కానీ విద్యాశాఖ అధికారులు మాత్రం 50 శాతం మాత్రమే సీట్లను యూజీ విద్యార్థులకు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. తమకు హాస్టల్​లో 100 శాతం గదులు కేటాయించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Nizam College students dharna
Nizam College students dharna

హైదరాబాద్ నిజాం కళాశాలలో హాస్టల్ సౌకర్యం కోసం యూజీ విద్యార్థులు చేస్తున్న పోరాటం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం యూజీ, 50 శాతం పీజీ విద్యార్థులకు హాస్టల్ సీట్లు కేటాయిస్తూ.. విద్యాశాఖ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రంజిని, వార్డెన్​లు.. ఆందోళన చేస్తున్న విద్యార్థుల దగ్గరకు వచ్చి అర్హత కలిగిన విద్యార్థులు వసతి గృహంలో ప్రవేశానికి రావాలని సూచించారు.

వసతి గృహంలో గదులు కావాల్సిన వారు ఈ నెల 17లోపు దరఖాస్తు పెట్టుకోవాలని.. 19లోపు అర్హత ఉన్న విద్యార్థుల లిస్ట్ ప్రకటిస్తామని వైస్ ప్రిన్సిపాల్ తెలిపారు. 2017లో మంత్రి కేటీఆర్ నిజాం కాలేజీకి వచ్చినప్పుడు బాలికల వసతి గృహం కోసం వినతిపత్రం ఇచ్చామని విద్యార్థులు తెలిపారు. తమ సమస్యను చూసి కేటీఆర్ రూ.5 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. తమ వల్లనే నూతన వసతి గృహం నిర్మాణం అయ్యిందన్నారు.

తమకు హాస్టల్​లో 100 శాతం గదులు కేటాయించే వరకు పోరాటం కొనసాగిస్తామని యూజీ విద్యార్థులు స్పష్టం చేశారు. గత ఎనిమిది రోజులుగా ఆందోళన చేస్తున్నామని.. తమ న్యాయమైన డిమాండ్​పై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.