ETV Bharat / state

Sitakka: 'ప్రభుత్వం కలెక్టర్​ను పంపి.. చేతులు దులుపుకుంది'

author img

By

Published : Sep 13, 2021, 12:09 PM IST

Updated : Sep 13, 2021, 1:23 PM IST

Sitakka
ఎమ్మెల్యే సీతక్క

వినాయక చవితి రోజు నగరం నడిబొడ్డులో గిరిజన బాలికపై జరిగిన అన్యాయంపై... ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించకపోవడంపై ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్​ను పంపి ప్రభుత్వం చేతులు దులుపుకున్నదని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌ సైదాబాద్‌లో బాలికపై అఘాయిత్యం, హత్యపై ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం శోచనీయమని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆమె చిన్నారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందని సీతక్క వ్యాఖ్యానించారు.

ఘటనపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదు. గణేశ్‌ చరుత్థి రోజున నగరం నడిబొడ్డున దారుణం జరిగింది. కానీ ఇప్పటివరకు సీఎం, కేటీఆర్ స్పందించకపోవడం ఏంటి?. నిందితుడికి గంజాయి మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు సమాచారముంది. అతనిని ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. గిరిజన బిడ్డకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించలేదు. కనీసం గిరిజన ఎమ్మెల్యేలు కూడా స్పందించలేదు. కలెక్టర్‌ను పంపి చేతులు దులుపుకున్నారు.

-ఎమ్మెల్యే సీతక్క

ఎమ్మెల్యే సీతక్క పరామర్శ

నిందితుడికి గంజాయి మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోందని సీతక్క విమర్శించారు. గిరిజన బిడ్డకి అన్యాయం జరిగితే కనీసం ఆ సామాజికవర్గ ఎమ్మెల్యేలు మాట్లాడకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి... బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: Hyderabad girl rape: సైదాబాద్‌ బాలిక హత్య.. పోలీసుల అదుపులో నిందితుడు

Rape On Child: అందరు అనుమానించిందే నిజమైంది.. చిన్నారిని వాడే చిదిమేశాడు..

Last Updated :Sep 13, 2021, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.