ETV Bharat / state

నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై తలసాని సమీక్ష, నిమజ్జనం ఎప్పుడంటే

author img

By

Published : Aug 16, 2022, 9:56 PM IST

ganesh navratri 2022 వినాయక నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా.. ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ పేర్కొన్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాలు ఈ నెల 31న ప్రారంభం అవుతాయని.. సెప్టెంబర్​ 9న నిమజ్జనం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించిన తలసాని, నిమజ్జనం ఎప్పుడంటే
నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించిన తలసాని, నిమజ్జనం ఎప్పుడంటే

ganesh navratri 2022 గణేశ్​ నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 31న మొదలవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ ఉత్సవాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా.. అందరి సహకారంతో ఘనంగా నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో గణేశ్​ నవరాత్రుల నిర్వహణ, నిమజ్జనం ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశాల్లో హోంమంత్రి మహమూద్ అలీ, నగర పోలీస్​ కమిషనర్ సీవీ ఆనంద్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వినాయక నిమజ్జనం సెప్టెంబర్ 9న జరుగుతుందని.. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్​ పేర్కొన్నారు. హెచ్‌ఎండీఏ, కాలుష్య నియంత్రణ మండలి తలా లక్షా విగ్రహాలను పంపిణీ చేస్తున్నాయని తెలిపారు. నిమజ్జనం రోజు లైటింగ్, క్రేన్‌లు, జనరేటర్లు, స్టేజ్‌లను ఏర్పాటు చేస్తున్నామని.. హుస్సేన్​సాగర్‌లో గజ ఈతగాళ్లను నియమిస్తున్నామని మంత్రి వివరించారు.

ఇవీ చూడండి..

NGT notices on NIMZ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్జీటీ నోటీసులు

జైలు ఎదుట బిడ్డ మృతదేహంతో తల్లి ఆవేదన, భర్త కోసం 7 గంటలు నిరీక్షించి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.