ETV Bharat / state

KTR: కార్యకర్తల కుటుంబాలకు కేసీఆర్‌ పెద్దదిక్కుగా ఉంటారు: కేటీఆర్‌

author img

By

Published : Aug 5, 2021, 4:59 AM IST

తెరాస కార్యకర్తలను కంటికి రెప్పలా కాాపాడుకుంటామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. మరణించిన తెరాస కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 60 లక్షల మంది కుటుంబ సభ్యులు టీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబమేనన్నారు.

KTR
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌

రాష్ట్రంలో తెరాస కార్యకర్తల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ పెద్ద దిక్కుగా ఉంటారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. మరణించిన తెరాస కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.

బాధిత కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున చెక్కులను అందించిన కేటీఆర్‌ .. తన దృష్టికి తెచ్చిన సమస్యలను 15 రోజుల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యకర్తల కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలో మరింత కష్టపడి పనిచేద్దామని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. 60 లక్షల సభ్యత్వం కలిగిన అజేయశక్తిగా తెరాస పార్టీ ఎదిగిందన్నారు. రాష్ట్రంలోని 60 లక్షల మంది కుటుంబ సభ్యులు టీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబమేనన్నారు.


ఇదీ చూడండి:

KTR: కేటీఆర్​కు హిమాన్షు ఎప్పుడూ కాల్​ చేయనన్నాడట.. దాని ద్వారానే మాట్లాడతాడట..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.