ETV Bharat / state

ఇది అమాయక కర్ణాటక కాదు - తెలివైన తెలంగాణ : కేటీఆర్​

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 11, 2023, 9:21 AM IST

Siddaramaiah Comments on KCR Government
KTR Fires On Karnataka CM Siddaramaiah

KTR Tweet On Karnataka CM Siddaramaiah : కామారెడ్డిలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్​ ఎక్స్ వేదికగా స్పందించారు. పదేళ్లలో తెలంగాణలోని ఆదిలాబాద్​ నుంచి అలంపూర్ వరకు ప్రజాభిమానం ఏర్పరచుకున్న సర్కార్ బీఆర్ఎస్​ అయితే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు గడవకముందే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం కర్ణాటకది అని విమర్శించారు.

KTR Tweet On Karnataka CM Siddaramaiah : కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ సభలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యలపై.. బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ ఘాటుగా స్పందించారు. కర్ణాటకలో కాంగ్రెస్​ పార్టీది 5 గంటల ఫెయిల్యూర్ మోడల్​ అయితే తెలంగాణలో బీఆర్​ఎస్​ది 24 గంటల పవర్​ఫుల్ మోడల్ అన్నారు. కేసీఆర్​ అధికారంలోకి వచ్చిన పదేళ్ల ప్రస్థానం తర్వాత ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రజాభిమానం వెల్లువెత్తుతున్న పాలన కేసీఆర్​ ప్రభుత్వానిదని.. అధికారం చేపట్టి 6 నెలలు గడవకముందే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం కర్ణాటకదని విమర్శించారు.

KTR Fires On Karnataka CM Siddaramaiah : ఎన్నికల్లో ఇచ్చిన.. ఐదు హామీలకు పాతరేసి.. నమ్మి ఓటేసిన ప్రజల్ని గాలికొదిలేసి.. తెలంగాణకు వచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తే నమ్మడానికి ఇది అమాయక కర్ణాటక కాదని.. తెలివైన తెలంగాణ అని కేటీఆర్​ దీటుగా బదులిచ్చారు. కర్ణాటకలో కనీసం రేషన్ ఇవ్వలేని కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణకు వచ్చి డిక్లరేషన్లు ఇస్తే విశ్వసించేదెవరని కేటీఆర్​ ప్రశ్నించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో బీసీలు ఇంకా వెనకబడి ఉన్నారంటే.. ఆ పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనని ధ్వజమెత్తారు. ఇప్పటికిప్పుడు కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే.. కాంగ్రెస్ సర్కారును సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నమ్మి మోసం చేసినందుకు వారికి సరైన గుణపాఠం చెప్పడం తథ్యమని కేటీఆర్‌ ట్వీట్​లో పేర్కొన్నారు.

KTR Comments on Revanth Reddy : "కొడంగల్‌లో నరేందర్​రెడ్డిపై గెలవని రేవంత్‌రెడ్డి... కేసీఆర్​పై గెలుస్తారా..?"

CM Siddaramaiah Speech at Kamareddy : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కామారెడ్డిలో జరిగిన సభలో పాల్గొని.. బీఆర్​ఎస్​ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ​ అదేవిధంగా బీసీ డిక్లరేషన్​ను ప్రకటించారు. అనంతరం కామారెడ్డి బీఆర్​ఎస్​ అభ్యర్థి అయిన కేసీఆర్​పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని అన్నారు. రేవంత్​ను ఓడించేందుకు సీఎం కేసీఆర్​ రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్​ పదేళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలిందని మండిపడ్డారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలను బీఆర్​ఎస్​ను ఓడించాలని నిర్ణయించుకున్నారని జోస్యం చెప్పారు.

'సీఎం కేసీఆర్‌పై రేవంత్‌ రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయం'

Siddaramaiah Comments on KCR Government : ప్రజలు కేసీఆర్​ను ఓటు ద్వారా ఇంటికి పంపాలనుకుంటున్నారని.. ఆ రోజు కోసమే వేచి చూస్తున్నారని సిద్ధరామయ్య అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలిచి అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేసిందని స్పష్టం చేశారు. కేసీఆర్​ గ్యారెంటీలను అమలు చేయలేదని అంటున్నారని.. కర్ణాటక వచ్చి చూస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. తెలంగాణకు మోదీ ఎన్నిసార్లు వచ్చినా బీజేపీ అధికారంలోకి రాదని ఎద్దేవా చేశారు.

గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడే - అందుకే హ్యాట్రిక్​పై అంత ధీమాగా ఉన్నాం : మంత్రి కేటీఆర్

మైనారిటీల విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఆలోచనలు ఒకేలా ఉన్నాయి : మంత్రి కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.