ETV Bharat / state

తెలంగాణ భవిష్యత్తును కామారెడ్డి ప్రజలు నిర్ణయించబోతున్నారు - ఇక్కడి తీర్పు కోసం దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది : రేవంత్​రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 10, 2023, 7:05 PM IST

Updated : Nov 10, 2023, 7:55 PM IST

Revanth Reddy Challenge to CM KCR : సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే ప్రజాప్రతినిధుల కొనుగోళ్లపై సీబీఐ, ఈడీ విచారణకు లేఖ రాయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. తాను ఓటు కొంటూ దొరికానని అంటున్నారు.. మరి 54 మంది ప్రజాప్రతినిధులను కేసీఆర్‌ కొనలేదా అంటూ ప్రశ్నించారు. కామారెడ్డిలో బీసీ గర్జన సభలో పాల్గొని ఘాటైన విమర్శలు చేశారు.

Revanth Reddy Challenged CM KCR
Revanth Reddy Challenged CM KCR

Revanth Reddy Challenge to CM KCR : ప్రజాప్రతినిధుల కొనుగోళ్లపై సీబీఐ, ఈడీ విచారణకు సిద్ధమా అంటూ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. కేసీఆర్‌కు దమ్ముంటే 24 గంటల్లో విచారణ కోసం లేఖ(Revanth Reddy Vs KCR) రాయాలన్నారు. తాను ఓటు కొంటూ దొరికానని కేసీఆర్‌ అంటున్నారని.. 40 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎంపీలను కేసీఆర్‌ కొనలేదా అంటూ రేవంత్ ప్రశ్నించారు. కామారెడ్డిలో నామినేషన్‌ వేసిన అనంతరం అక్కడ నిర్వహించిన బీసీ గర్జన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ డిక్లరేషన్‌(BC Delaration)ను కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కలిసి విడుదల చేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

తెలంగాణ భవిష్యత్తును కామారెడ్డి ప్రజలు నిర్ణయించబోతున్నారని.. ఇక్కడి ప్రజలు ఇచ్చే తీర్పు కోసం దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనకు చరమగీతం పాడడానికి కామారెడ్డి సిద్ధంగా ఉందని తెలిపారు. గత పదేళ్లపాటు గజ్వేల్‌ వాసులను మోసం చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు కామారెడ్డి భూములపై ఆయన కన్ను పడిందని ఆరోపించారు. అందుకే ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్‌ కట్టుకున్నారన్నారు.

ప్రచారంలో 'కరెంట్‌' మంటలు - బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మాటల తూటాలు

Revanth Reddy Fires on CM KCR : కేసీఆర్‌ చేసిన ద్రోహాన్ని ప్రజలకు చాటేందుకే కామారెడ్డిలో పోటీ చేస్తున్నానని.. చెప్పారు. కానీ కేసీఆర్‌ కుటుంబం కోసమేనా.. 1200 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నది అని ఆవేదన చెందారు. ఈ అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని ప్రపంచమంతా కామారెడ్డి వైపు చూసేలా.. ఇక్కడ ఓటర్లు తీర్పు ఇవ్వబోతున్నారని వివరణ ఇచ్చారు. షబ్బీర్‌ అలీ కామారెడ్డి నుంచి గెలిచే చిన్న వయసులోనే మంత్రి అయ్యారన్నారు.

"దగ, మోసం, అహంకారం, దోపిడితో పదేళ్లు తెలంగాణను చెరబట్టిన కేసీఆర్‌కు చరమగీతం పాడడానికి కామారెడ్డి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కామారెడ్డి ప్రజల ఓట్లు కావాలని.. అందుకే కేసీఆర్‌ నక్క వినయాలు ప్రదర్శిస్తున్నారు. ఆయన చెబుతున్నారు.. ఈ ప్రాంతాన్ని బంగారు తునక లెక్క చేస్తానని. గజ్వేల్‌లోను గెలిచారు కదా అక్కడ బంగారు తునక చేసి ఉంటే గజ్వేల్‌ నుంచి పారిపోయి కామారెడ్డికి ఎందుకు వస్తావు అని అడుగుతున్నా. కామారెడ్డి చుట్టు పక్కల ఉన్న సారవంతమైన భూములను ఆక్రమించుకోవడానికి వస్తున్నారు." -రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

24 గంటల్లో ప్రజాప్రతినిధుల కొనుగోళ్లపై విచారణ చేయాలి : సీఎం కేసీఆర్‌కు ఒక్కటే సవాల్‌ విసురుతున్న.. ప్రజాప్రతినిధుల కొనుగోళ్లపై విచారణకు సిద్ధమవ్వాలన్నారు. 50 లక్షలకు ఓటు కొనేందుకు ప్రయత్నించానని కేసీఆర్‌ తనపై ఆరోపణ చేశారని మండిపడ్డారు. 40 మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను కేసీఆర్‌ ఎన్ని వందల కోట్లకు కొన్నారో చెప్పాలని ప్రశ్నించారు. అందుకే కేసీఆర్‌కు దమ్ముంటే.. నా కేసు, నీ కేసు.. రెండింటిపై సీబీఐ, ఈడీ విచారణకు రెడీనా అంటూ సవాల్‌ విసిరారు. ఇంకా చెప్పాలంటే ఈ రాష్ట్రాన్నే కొనుగోలు కేంద్రంగా మార్చిందే కేసీఆర్‌ అని విమర్శించారు. తెలంగాణ రాజకీయాలను అంగడి సరుకుగా మార్చిందే కేసీఆర్‌ అని ఆరోపణలు చేశారు. గంప గోవర్ధన్‌ గతంలో టీడీపీ ఎమ్మెల్యే కాదా.. అమ్మకాలు, కొనుగోళ్ల గురించి కేసీఆర్‌కు మాట్లాడే హక్కు లేదని రేవంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Revanth Reddy Challenge to CM KCR

ఎర్రబెల్లి వల్లే నేను జైలుకు పోవాల్సి వచ్చింది: రేవంత్ రెడ్డి

Revanth Reddy Challenge to KCR : 'కర్ణాటకలో అమలు అవుతున్న పథకాలు చూసేందుకు సిద్ధమా?'

Revanth Reddy Challenge to CM KCR : ప్రజాప్రతినిధుల కొనుగోళ్లపై సీబీఐ, ఈడీ విచారణకు సిద్ధమా అంటూ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. కేసీఆర్‌కు దమ్ముంటే 24 గంటల్లో విచారణ కోసం లేఖ(Revanth Reddy Vs KCR) రాయాలన్నారు. తాను ఓటు కొంటూ దొరికానని కేసీఆర్‌ అంటున్నారని.. 40 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎంపీలను కేసీఆర్‌ కొనలేదా అంటూ రేవంత్ ప్రశ్నించారు. కామారెడ్డిలో నామినేషన్‌ వేసిన అనంతరం అక్కడ నిర్వహించిన బీసీ గర్జన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ డిక్లరేషన్‌(BC Delaration)ను కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కలిసి విడుదల చేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

తెలంగాణ భవిష్యత్తును కామారెడ్డి ప్రజలు నిర్ణయించబోతున్నారని.. ఇక్కడి ప్రజలు ఇచ్చే తీర్పు కోసం దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనకు చరమగీతం పాడడానికి కామారెడ్డి సిద్ధంగా ఉందని తెలిపారు. గత పదేళ్లపాటు గజ్వేల్‌ వాసులను మోసం చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు కామారెడ్డి భూములపై ఆయన కన్ను పడిందని ఆరోపించారు. అందుకే ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్‌ కట్టుకున్నారన్నారు.

ప్రచారంలో 'కరెంట్‌' మంటలు - బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మాటల తూటాలు

Revanth Reddy Fires on CM KCR : కేసీఆర్‌ చేసిన ద్రోహాన్ని ప్రజలకు చాటేందుకే కామారెడ్డిలో పోటీ చేస్తున్నానని.. చెప్పారు. కానీ కేసీఆర్‌ కుటుంబం కోసమేనా.. 1200 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నది అని ఆవేదన చెందారు. ఈ అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని ప్రపంచమంతా కామారెడ్డి వైపు చూసేలా.. ఇక్కడ ఓటర్లు తీర్పు ఇవ్వబోతున్నారని వివరణ ఇచ్చారు. షబ్బీర్‌ అలీ కామారెడ్డి నుంచి గెలిచే చిన్న వయసులోనే మంత్రి అయ్యారన్నారు.

"దగ, మోసం, అహంకారం, దోపిడితో పదేళ్లు తెలంగాణను చెరబట్టిన కేసీఆర్‌కు చరమగీతం పాడడానికి కామారెడ్డి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కామారెడ్డి ప్రజల ఓట్లు కావాలని.. అందుకే కేసీఆర్‌ నక్క వినయాలు ప్రదర్శిస్తున్నారు. ఆయన చెబుతున్నారు.. ఈ ప్రాంతాన్ని బంగారు తునక లెక్క చేస్తానని. గజ్వేల్‌లోను గెలిచారు కదా అక్కడ బంగారు తునక చేసి ఉంటే గజ్వేల్‌ నుంచి పారిపోయి కామారెడ్డికి ఎందుకు వస్తావు అని అడుగుతున్నా. కామారెడ్డి చుట్టు పక్కల ఉన్న సారవంతమైన భూములను ఆక్రమించుకోవడానికి వస్తున్నారు." -రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

24 గంటల్లో ప్రజాప్రతినిధుల కొనుగోళ్లపై విచారణ చేయాలి : సీఎం కేసీఆర్‌కు ఒక్కటే సవాల్‌ విసురుతున్న.. ప్రజాప్రతినిధుల కొనుగోళ్లపై విచారణకు సిద్ధమవ్వాలన్నారు. 50 లక్షలకు ఓటు కొనేందుకు ప్రయత్నించానని కేసీఆర్‌ తనపై ఆరోపణ చేశారని మండిపడ్డారు. 40 మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను కేసీఆర్‌ ఎన్ని వందల కోట్లకు కొన్నారో చెప్పాలని ప్రశ్నించారు. అందుకే కేసీఆర్‌కు దమ్ముంటే.. నా కేసు, నీ కేసు.. రెండింటిపై సీబీఐ, ఈడీ విచారణకు రెడీనా అంటూ సవాల్‌ విసిరారు. ఇంకా చెప్పాలంటే ఈ రాష్ట్రాన్నే కొనుగోలు కేంద్రంగా మార్చిందే కేసీఆర్‌ అని విమర్శించారు. తెలంగాణ రాజకీయాలను అంగడి సరుకుగా మార్చిందే కేసీఆర్‌ అని ఆరోపణలు చేశారు. గంప గోవర్ధన్‌ గతంలో టీడీపీ ఎమ్మెల్యే కాదా.. అమ్మకాలు, కొనుగోళ్ల గురించి కేసీఆర్‌కు మాట్లాడే హక్కు లేదని రేవంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Revanth Reddy Challenge to CM KCR

ఎర్రబెల్లి వల్లే నేను జైలుకు పోవాల్సి వచ్చింది: రేవంత్ రెడ్డి

Revanth Reddy Challenge to KCR : 'కర్ణాటకలో అమలు అవుతున్న పథకాలు చూసేందుకు సిద్ధమా?'

Last Updated : Nov 10, 2023, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.