ETV Bharat / state

G20 Meeting in Hyderabad : 'మూలాల్లోకి వెళ్దాం... భవిష్యత్తులోకి అడుగేద్దాం'

author img

By

Published : Jun 17, 2023, 12:00 PM IST

Updated : Jun 17, 2023, 12:55 PM IST

G20 Agriculture Ministers Meeting in Hyderabad : హైదరాబాద్ వేదికగా జీ-20 సభ్య దేశాల‌ వ్యవసాయ మంత్రుల సమావేశంలో వ్యవసాయ సవాళ్ల పరిష్కారాలపై విస్తృత చర్చలు సాగుతున్నాయి. రెండో రోజు జరిగిన సమావేశాల్లో.. అమెరికా, యూకే, జపాన్, ఇటలీ దేశాల మంత్రులు, యూరోపియన్ యూనియన్ కమిషనర్​తో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ భేటీ అయ్యారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయ రంగం సర్వతోముఖాభివృద్ధికి వివిధ దేశాలతో సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చించారు.

G20
G20

'మూలాల్లోకి వెళ్దాం... భవిష్యత్తులోకి అడుగేద్దాం'

PM Modi speech at G20 Agricultural Meet In Hyderabad : హైదరాబాద్ మాదాపూర్‌లోని హెచ్​ఐసీసీలో జీ-20 సభ్య దేశాల వ్యవసాయశాఖ మంత్రుల సదస్సు కొనసాగుతోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సదస్సుకు కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రులు కైలాష్‌చౌదరి, శోభ కరంద్లాజే, పలు దేశాల వ్యవసాయ మంత్రులు, కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణహితం దృష్ట్యా ఆహార భద్రత, లాభసాటి సుస్థిర వ్యవసాయం, రైతు ఆదాయాలు పెంపు, జీ-20 దేశాలు వ్యవసాయానికి ఇస్తున్న ప్రాధాన్యతలు, పరిశోధనలు వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చ సాగుతోంది.

G20 Agriculture Ministers Meeting in Hyderabad : సాగురంగంలో సవాళ్లను అధిగమించి.... ప్రపంచంలో ఆహార భద్రత లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని దేశాలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. జీ-20 దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.... వాతావరణ మార్పులతో వ్యవసాయ రంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటుందని చెప్పారు. నూతన ఆవిష్కరణలు, డిజిటల్‌ సాంకేతికతల ద్వారా రైతులు సాధికారత సాధించాలని ప్రధాని ఆకాంక్షించారు.

'ఎంతో కీలకమైన వ్యవసాయరంగంపై భారతదేశం ప్రత్యేక దృష్టి సారించింది. 'మూలాల్లోకి వెళదాం... భవిష్యత్తులోకి అడుగేద్దాం' అనే నినాదంతో భారతదేశం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం 250 కోట్ల మంది ప్రజలకు జీవనాధారంగా ఉంది. ప్రపంచ దేశాల జీడీపీలో 30% భాగస్వామ్యం, 60 శాతానికి పైచిలుకు ఉద్యోగాలను సాగు రంగం కల్పిస్తోంది. నేడు వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం, కరోనా మహమ్మారి కారణంగా సరఫరా గొలుసు అంతరాయం మరింత పెరిగింది. వాతావరణంలో మార్పు అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి పెనుసవాల్‌గా మారింది.' - నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

Narendra Modi About G20 Agricultural Meet : కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా ప్రారంభోపన్యాసంతో రెండో రోజు సదస్సు ప్రారంభం కాగా... దిల్లీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ జీ-20 సదస్సు ఉద్దేశించి దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించారు. సమ్మిళిత, సంతులిత ఆహారవ్యవస్థల వృద్ధితోపాటు సన్నకారు రైతుల అభ్యున్నతికి కృషి చేయాలని.. భూసారం పెంపుదల, అధిక దిగుబడుల సాధనపై దృష్టి సారించాలని సూచించారు. వాతావరణంలో మార్పు కారణంగా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని.... భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం, కరోనా మహమ్మారి కారణంగా సరఫరా గొలుసు అంతరాయం మరింత పెరిగిందన్నారు. నూతన ఆవిష్కరణలు, డిజిటల్‌ సాంకేతికతల ద్వారా రైతులు సాధికారత సాధించాలని ప్రధాని ఆకాంక్షించారు.

'మూలాల్లోకి వెళదాం... భవిష్యత్తులోకి అడుగేద్దాం' అనే నినాదంతో భారతదేశం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని చెప్పిన ప్రధాని.. అన్నదాతలకు సాంకేతికతను అందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. పొలాల్లో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయటం, వ్యవసాయ క్షేత్రాల్లో డ్రోన్లను వినియోగిస్తున్నట్లు తెలిపారు. పంటల ఎంపికకు, సాగులో గరిష్ఠ ప్రయోజనాలను అందుకోవడానికి భూసార ఆరోగ్యకార్డులను వాడుతున్నారని తెలిపారు. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుతున్న నేపథ్యంలో... చిరుధాన్యాల సాగులో అత్యుత్తమ అభ్యాసాలను, పరిశోధనలను, సాంకేతికతలను పరస్పరం పంచుకోవాల్నారు. దీనికోసం హైదరాబాద్‌లోని చిరుధాన్యాల పరిశోధన సంస్థను అత్యుత్తమ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ప్రధాని తెలిపారు.ఈ నెల 15న హైదరాబాద్‌లో ప్రారంభమైన జీ-20 వ్యవసాయశాఖ మంత్రుల సదస్సు ఇవాళ్టితో ముగియనుంది.

ఇవీ చదవండి:

Last Updated :Jun 17, 2023, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.