ETV Bharat / state

వివేకా హత్య కేసు.. హైదరాబాద్​ సీబీఐ కోర్టులో హాజరుకానున్న నిందితులు

author img

By

Published : Feb 10, 2023, 9:14 AM IST

Vivekananda Reddy
Vivekananda Reddy

Former Minister Vivekananda Reddy : మాజీ మంత్రి వివేకా హత్య కేసు నిందితులు హైదరాబాద్​ సీబీఐ కోర్టులో హాజరుకానున్నారు. నిందితులను కడప జైలు నుంచి పోలీసు బందోబస్తు మధ్య హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.

Viveka Murder Case : మాజీ మంత్రి వివేకా హత్య కేసు నిందితులను కడప జైలు నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని ప్రత్యేకంగా.. పోలీసు బందోబస్తు మధ్య తెల్లవారుజామున 4 గంటలకు కడప జైలు నుంచి నాలుగు వాహనాల్లో ముగ్గురు నిందితులను వేరువేరుగా పోలీసులు హైదరాబాద్​కు తీసుకొచ్చారు. ఇప్పటికే బెయిల్​పై ఉన్న ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్​ దస్తగిరి హైదరాబాద్​ చేరుకున్నారు. నిందితులను ఈ రోజు ఉదయం 10 : 30 గంటలకు హైదరాబాద్ సీబీఐ కోర్టులో హాజరపరచనున్నారు.

వివేకా హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ అయిన తర్వాత తొలిసారిగా ఐదుగురు నిందితులు హైదరాబాద్​లో సీబీఐ కోర్టు ముందు హాజరుకానున్నారు. కోర్టులో హాజరైన తర్వాత ముగ్గురు నిందితులను తిరిగి కడప జైలుకు తీసుకొస్తారా లేక చంచల్​గూడ తరలిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇది న్యాయమూర్తి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. నిందితులను హైదరాబాద్​కు తరలిస్తున్న క్రమంలో గురువారం సాయంత్రమే దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి భార్య తులసమ్మ, కుమారుడు చైతన్య రెడ్డి జైలుకెళ్లి ఆయన్ను కలిసి వచ్చారు. శివశంకర్ రెడ్డి అనుచరులు కూడా హైదరాబాద్​ చేరుకున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.