ETV Bharat / state

నిరుపేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ

author img

By

Published : May 23, 2020, 11:02 PM IST

Distribution of essentials to poor muslim families at vanasthalipuram
నిరుపేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ

క్రిస్టియన్​ మైనారిటీకి చెందిన ఖమ్మం బ్లెస్సో సామ్యూల్ ముస్లిం నిరుపేద కుటుంబాలకు సాయం చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. సమాజంలో అందరం సమానమేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని వనస్థలిపురంలో 35 నిరుపేద ముస్లిం కుటుంబాలకు సరకులను అందజేశారు.

లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు ఖమ్మంకు చెందిన బ్లెస్సో సామ్యూల్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో హైదరాబాదులోని వనస్థలిపురంలో 35 నిరుపేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సేవా కార్యక్రమాలు తమకు ఆదర్శమని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో నున్న జాన్, గౌతం రాజు, జాన్ కెన్నెడీ, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : రాష్ట్రం నుంచి ఇవాళ 45 వేల మంది వలస కార్మికుల తరలింపు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.