ETV Bharat / state

CWC Meeting Hyderabad 2023 : తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో విజయంపై సీడబ్ల్యూసీ ధీమా

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2023, 7:35 AM IST

CWC Meeting Hyderabad 2023
Congress latest news

CWC Meeting Hyderabad 2023 : తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.. లోక్‌సభ ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని విశ్వాసం వ్యక్తం చేసిన సీడబ్ల్యూసీ.. అన్ని అంశాల్లోనూ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని పేర్కొంది. నేతలంతా వ్యక్తిగత ఆకాంక్షలు, విభేదాలు పక్కనపెట్టి అవిశ్రాంతంగా శ్రమించాలని.. కర్ణాటక తరహాలో ఐక్యంగా ముందుకువెళ్తేనే విజయం సాధ్యమని స్పష్టం చేసింది.

CWC Meeting Hyderabad 2023 తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో విజయంపై సీడబ్ల్యూసీ ధీమా

CWC Meeting Hyderabad 2023 Ended : హైదరాబాద్‌లో రెండోరోజు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (Congress Working Committee) విస్తృత స్థాయి సమావేశంలో.. రానున్న5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు సహా వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు, ఆయా రాష్ట్రాల ఇంఛార్జ్‌లు, .. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. తమ ముందు చాలా సవాళ్లు ఉన్నాయని.. అవి కేవలం హస్తం పార్టీకి చెందినవి మాత్రమే కాదని.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

Mallikarjuna Kharge On CWC Meeting : భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి సంబంధించిన సవాళ్లని మలికార్జున ఖర్గే (Malikarjuna Kharge) వివరించారు. రెండు, మూడు నెలల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఆర్నెళ్లలో లోక్‌సభ ఎన్నికలతోపాటు జమ్మూకశ్మీర్ సమరానికి సన్నద్ధం కావాలని నేతలకు స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు.. సామాజిక న్యాయం, సంక్షేమంలో కొత్త నమూనాతో విజయవంతమయ్యాయని.. వాటిని దేశమంతటా ప్రచారం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

Congress Screening Committee to Meet on 20th September : ఈ నెల 20న కాంగ్రెస్​ స్క్రీనింగ్​ కమిటీ సమావేశం.. అప్పుడే అభ్యర్థుల జాబితా

CWC Meeting Details : ఇది పరీక్షా సమయమని మలికార్జున ఖర్గే తెలిపారు. పదేళ్ల బీజేపీ హయంలో సామాన్యులు ఎదుర్కొంటున్న సవాళ్లు పెరుగుతూ పోతున్నాయని వివరించారు. అన్ని వర్గాల సమస్యల్ని ప్రధాని నరేంద్ర మోదీ పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. ఈ తరుణంలో కలసికట్టుగా ఉండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత ప్రయోజనాలు, విభేదాలు పక్కనపెట్టి పార్టీ విజయం కోసం నిరంతరం శ్రమించాలని కాంగ్రెస్ నేతలకు మార్గనిర్దేశం చేశారు. సంస్థాగత ఐక్యత అత్యంత కీలకమని... కర్ణాటకలో అది ఫలించిందని మలికార్జు ఖర్గే గుర్తుచేశారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గణనీయంగా పుంజుకుందని ఆపార్టీ నేత చిదంబరం (Chidambaram) పేర్కొన్నారు. తెలంగాణలో భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) సత్ఫలితాలు ఇచ్చిందన్న ఆయన.. సీడబ్ల్యూసీ సమావేశాలు ఇక్కడే నిర్వహించటం కలిసి వచ్చే అంశమన్నారు. ఆయా రాష్ట్రాల పరిస్థితులను నేతలు సమావేశంలో వివరించారు. తమ ప్రాంతాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. అగ్రనేతలు తమ రాష్ట్రాల్లో పర్యటించాలని పలువురు నాయకులు విజ్ఞప్తి చేశారు.

Revanth Readdy Letter to Tenant Farmers : 'వరంగల్​ డిక్లరేషన్​లోని ప్రతి హామీ నెరవేరుస్తాం'.. కౌలు రైతులకి రేవంత్ బహిరంగ లేఖ

తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్‌గడ్, రాజస్థాన్‌ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కి విజయం కట్టబెడతారని సీడబ్ల్యూసీ ధీమా వ్యక్తంచేసింది. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత పైనా సమీక్షించిన వర్కింగ్ కమిటీ.. ఎన్నికల యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని విశ్వాసం వ్యక్తం చేసింది. శాంతి భద్రతలు, స్వేచ్ఛ , సామాజిక, ఆర్థిక న్యాయం, సమానత్వం తదితరాల విషయంలో ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని ప్రకటించింది.

కర్ణాటక తరహాలో నేతలంతా ఐక్యంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని తెలంగాణ నేతలకు సీడబ్ల్యూసీ సూచించింది. తెలంగాణ ఇచ్చిన సోనియాకు గత రెండు ఎన్నికల్లో బహుమతి ఇవ్వలేకపోయామన్న హస్తం పార్టీ నాయకులు.. ఈసారి కచ్చితంగా పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని తెలిపారు.

Congress Six Guarantees Telangana : విజయభేరి సభలో కాంగ్రెస్ ప్రకటించిన '6 గ్యారెంటీలు' ఇవే!

CWC Meeting Hyderabad 2023 : హైదరాబాద్‌లో ముగిసిన సీడబ్ల్యూసీ సమావేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.