టీపీసీసీ ఉత్తమ్కుమార్ రెడ్డి, కుంతియాలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఫయీమ్ ఖండించారు. రాజగోపాల్ రెడ్డికి ధైర్యం ఉంటే కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీ ఎమ్మెల్యేగా గెలవాలని సవాల్ విసిరారు. రాజకీయ వ్యభిచారిలా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధిష్ఠానానికి సూచించారు.
ఇవీ చూడండి:తోట రాముడు... ఇంట్లో కేటీఆర్ శ్రమదానం!