ETV Bharat / state

'కాంగ్రెస్‌ కార్యకర్తలను తెరాస నేతలు,పోలీసులు వేధిస్తున్నారు'

author img

By

Published : Dec 15, 2020, 5:15 PM IST

అధికార బలంతో తెరాస నాయకులు, పోలీసులు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్ అన్నారు. పోలీసులు పక్షపాతం లేకుండా వ్యవహారించాలని డిమాండ్ చేశారు.

congress leader niranjan on police and trs
'కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలను తెరాస, పోలీసులు వేధిస్తున్నారు'

కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలను తెరాస నాయకులతోపాటు పోలీసులు వేధిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్ ఆరోపించారు. నాయకులు, కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని... పార్టీ వారికి పూర్తిగా అండగా ఉంటుందని అన్నారు. పోలీసులు పక్షపాతం లేకుండా వ్యవహరించాలని నిరంజన్ కోరారు. రహమత్‌నగర్​లో సిరిసిల్లకు చెందిన తెరాస నాయకులు జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో డబ్బులు పంచుతూ దొరికారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు.

ఈ విషయంలో ఫ్లైయింగ్ స్క్వాడ్‌ పంపి ఆ నేతలను పట్టుకున్నామని 15,300 రూపాయలు దొరికాయని ఎన్నికల సంఘం తమకు తెలిపిందని పేర్కొన్నారు. అయితే పోలీసు కమిషనర్ తర్వాత ఇచ్చిన లేఖలో ఎలాంటి డబ్బులు దొరకలేదని.. కాంగ్రెస్ నాయకులు ఎఫ్ఎస్‌సీ టీమ్‌ వాహనాలను పగులగొట్టారని నాన్‌ బెయిలబుల్ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: రిజిస్ట్రేషన్​ సమస్యలపై ముగిసిన మంత్రివర్గ ఉపసంఘం భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.