ETV Bharat / state

Piyush Goyal on Paddy Procurement: 'ధాన్యం సేకరణలో జాప్యానికి తెరాస సర్కారు వైఫల్యమే కారణం'

author img

By

Published : Dec 8, 2021, 2:01 PM IST

Piyush Goyal on Paddy Procurement: 'ధాన్యం సేకరణలో జాప్యానికి తెలంగాణ సర్కారు వైఫల్యమే కారణం'
Piyush Goyal on Paddy Procurement: 'ధాన్యం సేకరణలో జాప్యానికి తెలంగాణ సర్కారు వైఫల్యమే కారణం'

ధాన్యం సేకరణలో జాప్యానికి తెరాస సర్కారు వైఫల్యమే కారణమని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ లోక్​సభలో తెలిపారు. తెలంగాణలో ధాన్యం సేకరణ అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించగా... దానికి కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ధాన్యం సేకరించి బియ్యాన్ని ఎఫ్​సీఐకి అప్పగించేందుకు ఇప్పటికే అనేకసార్లు కాలపరిమితిని పొడిగించినా తెరాస సర్కార్ లక్ష్యాన్ని చేరుకోలేదని పేర్కొన్నారు.

ధాన్యం సేకరణలో జరుగుతున్న జాప్యానికి తెరాస ప్రభుత్వానిదే వైఫల్యమని... కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ధాన్యం సేకరించి బియ్యాన్ని ఎఫ్​సీఐకి అప్పగించేందుకు ఇప్పటికే అనేకసార్లు కాలపరిమితిని పొడిగించినా తెరాస సర్కార్ లక్ష్యాన్ని చేరుకోలేదని పేర్కొన్నారు. లోక్​సభలో ఆహారభద్రత, పోషకాహారం లోపంపై చర్చ సందర్భంగా.. తెలంగాణలో ధాన్యం సేకరణ అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఫల్యం కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఉత్తమ్ సభ దృష్టికి తెచ్చారు. అయితే చర్చతో సంబంధం లేదని అంశంపై ప్రశ్న అడిగారని స్పీకర్ మైక్​ను కట్ చేశారు. అనంతరం కేంద్రమంత్రి గోయల్ సమాధానం ఇచ్చారు.

Piyush Goyal on Paddy Procurement: 'ధాన్యం సేకరణలో జాప్యానికి తెలంగాణ సర్కారు వైఫల్యమే కారణం'

రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు..

'బియ్యం సేకరణలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఫల్యాల కారణంగా తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. వరిసాగు చేసిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సభలో నాటకం చేసిన తెరాస ఎంపీలు వాకౌట్‌ చేశారు. ఆగస్టులో భారత ఆహార సంస్థ 40లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అక్టోబర్‌ నుంచే మార్కెట్‌కు ధాన్యం రావడం మొదలైనా ఈరోజు వరకు కూడా సగం కూడా ఎఫ్​సీఐ సేకరించలేదు.' -ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ

తెరాస ప్రభుత్వ వైఫల్యమే..

'ఎఫ్‌సీఐ తెలంగాణ కోసం రికార్డుస్థాయిలో బియ్యం సేకరణకు ఆమోదం తెలిపింది. అయితే తెలంగాణలో ఎఫ్‌సీఐ నేరుగా ధాన్యాన్ని సేకరించదు. రాష్ట్రప్రభుత్వం ధాన్యం సేకరించి బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అందిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అనేకసార్లు రాష్ట్రప్రభుత్వానికి కాలపరిమితిని పొడిగించాం. ఇన్నిసార్లు అనుమతులు ఇచ్చినప్పటికీ రాష్ట్రప్రభుత్వం బియ్యం అందించడంలో వైఫల్యం చెందడం విచారకరం. ఇప్పటికి కూడా మరోసారి అవకాశాన్ని పొడిగించాం. తెలంగాణ నుంచి ఎంత వేగంగా వస్తే అంతే వేగంగా ఎఫ్‌సీఐ కొనుగోలు చేస్తుంది. ధాన్యం సేకరణను రాష్ట్రప్రభుత్వం చేస్తుంది.. కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు.'

-పీయూష్‌ గోయల్‌, కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి

ఇదీ చదవండి:

Piyush Goyal on Paddy Procurement: 'ఒప్పందం మేరకే కొంటాం... ఎందుకు రాజకీయం చేస్తున్నారు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.