ETV Bharat / state

Central Election Commission Team to Visit Telangana : రాష్ట్రంలో 3 రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన.. షెడ్యూల్​ ఇదే

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2023, 6:09 PM IST

EC Officials Visit in Telangana
Central Election Commission Team to Visit Telangana in October

Central Election Commission Team to Visit Telangana : తెలంగాణ ఎన్నికల ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం బృందం అక్టోబర్​ 3వ తేదీన పర్యటించనుంది. మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి సంబంధిత రాజకీయ పార్టీలతో, అధికారులతో చర్చించనుంది.

Central Election Commission Team to Visit Telangana : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కసరత్తు వేగవంతంగా ముందుకు సాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం చేయాల్సిన పనులను తొందరగా నిర్వహించేందుకు తగిన ప్రణాళికలను రూపొందిస్తోంది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సన్నాహకాలను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం వచ్చే నెల మూడో తేదీ నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్(Vikas Raj) తెలిపారు. మూడు రోజుల పాటు హైదరాబాద్​లో పర్యటించనున్న ఈసీ బృందం.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతో పాటు రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. అక్టోబర్ మూడో తేదీన జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమై ఎన్నికల నిర్వహణాపరమైన అంశాలపై చర్చించనుంది.

Central Election Team Visit in Hyderabad : ఎక్సైజ్, ఆదాయపన్ను, జీఎస్టీ, రవాణా, తదితర నిఘా విభాగాల అధికారులు, బ్యాంకర్లతో సమావేశం కానుంది. ఈ చర్చలో డబ్బు, మద్యం, ఉచిత కానుకల ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర, రాష్ట్ర పోలీస్​ బలగాల నోడల్ అధికారులతో సమావేశమై భద్రతా పరమైన ప్రణాళిక, ఏర్పాట్లపై సమీక్షిస్తారు. రెండో రోజు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఈసీ బృందం సమావేశం కానుంది.

Telangana Assembly Elections Schedule 2023 : అక్టోబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌


Telangana Assembly Elections 2023 : జిల్లాల వారీగా ఎన్నికల ప్రణాళిక, ఏర్పాట్లను సమీక్షించనుంది. మూడో రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సీఎస్, డీజీపీ.. తదితర ఉన్నతాధికారులతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. ఓటర్లకు అవగాహనా కార్యక్రమాలపైనా ఈ బృందం దృష్టి సారిస్తుంది. ఓటర్ల జాబితా(List of Voters), పౌరుల భాగస్వామ్యానికి సంబంధించి ప్రచారం నిర్వహిస్తున్న ప్రముఖులు, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతో కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమావేశం కానుంది.

Telangana Chief Electoral Officer Vikas Raj on Assembly Elections : ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు.. పెద్ద ఎత్తున చైతన్యపరిచేలా కార్యక్రమాలు చేపట్టింది. ఓటరుగా నమోదు చేసినప్పుడు ఫారమ్​ 6,7,8 లను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులకు సలహాలు ఇచ్చింది. కొత్తగా ఓటరు నమోదు, ఓటరు బదిలీ, సంబంధిత అభ్యంతరాలపై అధికారులు దృష్టి పెట్టేందుకు తగిన చర్యలు చేపట్టాలని తెలిపింది. గుర్తింపు కార్డు పొందేందుకు ముద్రణ ప్రక్రియ కూడా వేగంవంతంగా చేసేందుకు తగిన ఆదేశాలు జారీ చేసింది. ఓటర్లకు ప్రతి 15 రోజులకి ఒక్కసారి ముద్రించి, అర్హులైన వారికి వెంటనే చేరేలా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొంది.

Telangana Assembly Election 2023 : జమిలి ఎన్నికలు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్​పై ప్రభావం చూపుతాయా?

CEO Vikas Raj Review on Voter Enrolment in Hyderabad : 'ఓటు హక్కు నమోదు చేసుకునేలా.. ఓటర్లను చైతన్య పరచాలి'

Chief Election Officer on Assembly Elections 2023 : 'డబుల్ ఓట్ల తొలగింపు.. ఓటింగ్ శాతం పెంచడమే మా ప్రధాన లక్ష్యాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.