ETV Bharat / state

Cash Seized During Police Check in Hyderabad : ఎన్నికల కోడ్‌ అమలు.. 3 రోజుల్లోనే.. భారీ స్థాయిలో నగదు స్వాధీనం

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2023, 7:53 PM IST

Police Seized Illegal Money in Telangana
Police Caught Huge Hawala Cash in Hyderabad

Cash Seized During Police Check in Hyderabad : ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న అభ్యర్థులు.. ప్రలోభాల కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు జారీ చేసింది. ఈ మేరకు అధికార యంత్రాంగం విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఆ సోదాల్లో పెద్ద మొత్తంలో డబ్బు, బంగారం, మద్యం పట్టుబడుతోంది.

Cash Seized During Police Check in Hyderabad : రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సమయాత్తమవుతోంది. నవంబర్‌ 30న జరిగే ఎన్నికలపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవి ఆనంద్ ఉన్నతాధికారుతో సమీక్షించారు. శాఖాపరంగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అక్రమ నగదు(Illegal Money), మద్యం, మాదక ద్రవ్యాలు లేదా ఇతర ప్రలోభాలపై కఠిన చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రచార సమయంలో వివిధ రాజకీయ పార్టీల ఒకే మార్గంలో తారసపడకుండా చూసుకోవాలని.. దీంతో పాటు రూట్‌ ప్లానింగ్, టైమింగ్, అనుమతుల జారీపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీపీ స్పష్టం చేశారు.

Police Checking Points in Telangana : ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లడం ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడొచ్చని తెలిపారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఆయుధాలకి కొత్త లైసెన్స్‌లు జారీ చేయకూడదని సీవీ ఆనంద్‌ సూచించారు. ఇంటిగ్రేటెడ్ ఇంటర్ కమిషనరేట్ చెక్‌పోస్టుల సంఖ్యను 11 నుంచి 18కి పెంచనున్నట్లు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల(Social Media)పై పర్యవేక్షణ, హవాలా ఆపరేటర్లపై నిఘా పెట్టాలని దిశానిర్దేశం చేశారు.

Police Caught Huge Hawala Cash in Hyderabad: బంజారాహిల్స్​లో రూ.3.35 కోట్ల హవాలా మనీ పట్టివేత

Hyderabad Police Seized Unaccounted Money and Gold : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికార యంత్రాంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోందని సీపీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడే తనిఖీలు, సోదాల్లో భారీగా సొత్తు లభిస్తోంది. ఇప్పటివరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తనిఖీల్లో రూ.5.1 కోట్ల నగదు, రూ.42 కోట్లు విలువైన బంగారం(Gold) స్వాధీనం చేసుకున్నట్లు సీవీ ఆనంద్‌(CV Anandh) తెలిపారు. మంగళవారం రాత్రి బంగారం వ్యాపారి నుంచి కూకట్‌పల్లిలోని రూ.2కోట్లు విలువైన బంగారం, వజ్రాలను ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని కూకట్‌పల్లి పోలీసులకు అప్పగించారు. ఆ వ్యాపారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Police Seized RS.45 Lakhs in Suryapeta : సూర్యాపేట చిలుకూరులో తనిఖీల్లో రూ.45లక్షలు స్వాధీనం చేసుకోగా.. తమ్మర వద్ద నిర్వహించిన తనిఖీల్లో కారు డ్రైవర్‌ నుంచి రూ.7.30 లక్షలను పోలీసులు జప్తు చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌ వద్ద తనిఖీల్లో రసీదులు లేకుండా తీసుకెళ్తున్న రూ.30 లక్షల విలువైన 50 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి పటాన్‌చెరులో వాహన తనిఖీల్లో రూ.7 లక్షలు చిక్కాయి. సరైన పత్రాలు చూపి నగదు, బంగారంతో పాటు ఇతరత్రా వస్తువులు తీసుకెళ్తే ఏ ఇబ్బంది లేదని పోలీసులు స్పష్టం చేశారు.

మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరి నుంచి రూ.8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లాలోని తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులో తనిఖీలు చేసిన పోలీసులకు రూ.2.40 లక్షల నగదు లభ్యమైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి వద్ద రూ.4 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపకపొవడంతో నగదును పోలీసులు సీజ్ చేశారు.

How to Carry Money when Election Code : రూ.50వేలు కంటే ఎక్కువ తీసుకెళ్తే.. తప్పనిసరిగా ఈ రూల్స్ తెలుసుకోవాల్సిందే...

Drugs Seize in Hyderabad : రాయదుర్గంలో డ్రగ్స్ స్వాధీనం.. రాజమండ్రికి చెందిన ముఠా అరెస్ట్​

Banjarahills CI Bribe Case Updates : లంచం డిమాండ్ కేసు.. బంజారాహిల్స్ సీఐ, ఎస్ఐ, హోంగార్డుకు ఏసీబీ నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.