ETV Bharat / bharat

దోపిడీ చేసిన పోలీసులు.. వ్యాపారవేత్తను బెదిరించి రూ.కోటి లూటీ.. తనిఖీలు చేస్తూ..

author img

By

Published : Aug 7, 2023, 11:31 AM IST

SI looted 1crore rupees From Businessman : ఓ వ్యాపారవేత్త నుంచి కోటి రూపాయలను దోచుకున్నారు పంజాబ్​ పోలీసులు. రెండు వేల రూపాయల నోట్లను మార్చుకుని తిరిగి వస్తున్న వ్యక్తిని బెదిరించి.. ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఘటన గురించి ఉన్నతాధికారులకు వ్యాపారవేత్త ​ఫిర్యాదు చేయడం వల్ల విషయం వెలుగులోకి వచ్చింది.

si-looted-1crore-rupees-from-businessman-in-panjab
వ్యాపారవేత్త నుంచి కోటి రూపాయలు దోచుకున్న ఎస్​ఐ

SI looted 1crore rupees From Businessman : సమాజంలో జరిగే అన్యాయాలను అరికట్టాల్సిన పోలీసులే దోపిడీకి పాల్పడ్డారు. కంచె చేను మేసినట్లుగా వ్యవహరించి.. ఓ వ్యాపారవేత్త నుంచి దాదాపు కోటి రూపాయలను దోచుకున్నారు పోలీసులు. ఓ కారులో తనిఖీలు చేపట్టగా.. అందులో డబ్బులను గుర్తించారు. అనంతరం ఆ వ్యాపారవేత్తను బెదిరించి.. ఆ మొత్తం సొమ్ముతో హుడాయించారు. శుక్రవారం పంజాబ్​లో ఘటన జరిగింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చండీగఢ్​లోని సెక్టార్​-39 పోలీస్​ స్టేషన్​ అదనపు సబ్​ ఇన్​​స్పెక్టర్​ నవీన్ ఫోగట్​గా ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. వీరితో పాటు వీరేంద్ర, శివకుమార్ అనే కానిస్టేబుళ్లు కూడా ఈ చోరీకి సాయం అందిచారు. ప్రస్తుతం ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు పోలీసుల అదుపులో ఉన్నారు. వీరి నుంచి రూ.75 లక్షలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

దోపిడీ అంశం బయటకు రాకుండా ఉండేందుకు స్థానిక పోలీసులు ప్రయత్నాలు చేసినప్పటికీ.. విషయం చండీగఢ్ ఎస్​ఎస్​పీ దాకా వెళ్లడం వల్ల ఘటన మొత్తం వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడు నవీన్​ ఫోగట్​ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిసింది. మరికొంత మంది పోలీసుల హస్తం కూడా ఈ దోపిడీలో ఉన్నట్లు సమాచారం. డీఎస్పీ చరణ్‌జిత్ సింగ్ ఘటనపై విచారణ చేస్తున్నారు.

ఇదీ జరిగింది..
ఆగష్టు 4న బఠిండాకు చెందిన వ్యాపారవేత్త సంజయ్​ గోయల్​.. కోటి రూపాయల విలువైన రూ.2వేల కరెన్సీ నోట్లను 500 రూపాయల నోట్లుగా మార్చుకుని మొహాలికి చేరుకున్నాడు. అనంతరం సెక్టార్​-40లో గిల్​ అనే వ్యక్తిని కలిశాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సబ్​ ఇన్​స్పెక్టర్ నవీన్​, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు.. సంజయ్​ కారును తనిఖీ చేశారు. అందులో కోటి రూపాయలను గుర్తించారు. ఆ మొత్తాన్ని సంజయ్​ను బెదిరించి వారే లాగేసుకున్నారు.

పోలీసులకు భయపడ్డ సంజయ్​.. అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు. మొత్తం విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. అనంతరం చండీగఢ్​​ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్​ను కలిసి ఘటనపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు చండీగఢ్​ ఎస్ఎస్​పీ. అనంతరం వ్యాపారవేత్త నుంచి డబ్బులు కాజేసిన పోలీసులపై కేసు నమోదైంది. ఘటనపై ప్రత్యేక దర్యాప్తు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

కానిస్టేబుల్​కు ఫుల్​గా​ మద్యం తాగించి 'ఖైదీ' పరార్​.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

సరిహద్దులు దాటిన మరో 'పెళ్లి' కథ.. ఆన్​లైన్​లో రాజస్థాన్​ యువకుడు- పాక్​ యువతి వివాహం

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.