ETV Bharat / state

Police Caught Huge Hawala Cash in Hyderabad: బంజారాహిల్స్​లో రూ.3.35 కోట్ల హవాలా మనీ పట్టివేత

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2023, 4:59 PM IST

Updated : Oct 10, 2023, 7:41 PM IST

Police Caught Huge Hawala Cash in Hyderabad : హైదరాబాద్​లో భారీగా హవాలా నగదు లభ్యమైంది. రూ.3.35 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్​కు చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Police Caught Huge Hawala Cash in Banjara Hills
Police Caught Huge Hawala Cash

Police Caught Huge Hawala Cash in Hyderabad : రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్​ విడుదల అయినప్పటి నుంచి.. ఎన్నికల కోడ్​ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు వాహనాలు, అధిక మొత్తంలో నగదును పట్టుకువెళ్లే వ్యక్తులపై నిఘా పెట్టారు. సోమవారం నుంచే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నగదును పట్టుకెళ్తున్న వ్యక్తులను, వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకొంటున్నారు.

Police Seized Money in Hyderabad : హైదరాబాద్​లోని బంజారాహిల్స్​ పరిధిలోని నలుగురు వ్యక్తుల నుంచి భారీ హవాలా మనీ(Hawala Money)ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.3.35 కోట్ల నగదును బంజారాహిల్స్ పోలీసులు పట్టుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవిస్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్​లోని నార్త్​జోన్​ టాస్క్​ ఫోర్స్(North Zone Task Force)​తో కలిసి బంజారాహిల్స్​ పోలీసులు తనిఖీలు చేపట్టారు.

కియా కారును తనిఖీ చేయగా..: ఈ క్రమంలో బంజారాహిల్స్​లోని రోడ్​ నంబర్​ 3 వద్ద వాహనాలు తనిఖీ చేశారు. పోలీసులకి అనుమానాస్పదంగా ఉన్న కియా కారును తనిఖీ చేశారు. కారులో రూ.3.35 కోట్ల నగదుని గుర్తించారు. ఈ మొత్తాన్ని హవాలా మనీగా నిర్ధారించుకుని.. డబ్బుతో పాటు నలుగురు నిందితులని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా.. ఆంధ్రప్రదేశ్​కు చెందిన చింపిరెడ్డి హనుమంత రెడ్డి, బచ్చల ప్రభాకర్, మండల శ్రీరాముల రెడ్డి, ఉదయ్ కుమార్​లుగా గుర్తించారు. ఇందులో ప్రధాన సూత్రధారి చింపిరెడ్డి అని తేలింది.

Police Caught Huge Hawala Cash in Hyderabad: బంజారాహిల్స్​లో రూ.3.35 కోట్ల హవాలా మనీ పట్టివేత

How to Carry Money when Election Code : రూ.50వేలు కంటే ఎక్కువ తీసుకెళ్తే.. తప్పనిసరిగా ఈ రూల్స్ తెలుసుకోవాల్సిందే...

Huge Hawala Cash Case Details : ప్రధాన నిందితుడు సూచనల మేరకు మిగిలి ముగ్గురు నిందితులు హవాలా మనీ సేకరిస్తారని డీసీపీ తెలిపారు. ఈ గ్యాంగ్ వివిధ ప్రాంతాల్లో డబ్బులను తరలిస్తారని పేర్కొన్నారు. బంజారాహిల్స్​లోని అరోరా కాలనీలోని సాయి కృప బిల్డింగ్​లో ప్లాట్ నంబర్​ 583ని తమ కార్యాలయంగా మార్చుకుని ఈ దందా నిర్వహిస్తున్నారని వెల్లడించారు.

ఈ గ్యాంగ్ సేకరించిన హవాలా మనీని తమ కార్యాలయానికి తీసుకువెళ్తుండగా పట్టుకున్నారని.. ఆ ప్లాట్​ని సీజ్​ చేశారని తెలిపారు. వారు కోటి రూపాయలకి రూ.25,000 కమీషన్​గా తీసుకుంటున్నారని గుర్తించారు. ఇవాళ ఉదయం ప్రభాకర్ రెడ్డి, హనుమంత్​ రెడ్డి కలిసి బేగం బజార్​, గోషామహల్​, నాంపల్లి, జూబ్లీహిల్స్​ ప్రాంతాల్లో రూ.3.35 కోట్లు సేకరించారని అన్నారు. పట్టుకున్న నగదు మొత్తాన్ని కోర్టులో సబ్మిట్​ చేస్తారని డీసీపీ జోయల్ డెవిస్ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాహన తనిఖీలు మరింత విస్తృతంగా చేస్తామని అన్నారు.

"ఇవాళ వాహనాలు తనిఖీ చేసినప్పుడు హవాల డబ్బును రూ.3.35 కోట్లు స్వాధీనం చేసుకున్నాం. ఈ డబ్బును తీసుకువెళ్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం. వీళ్లు రోడ్​ నంబర్​ 3 అరోరా కాలనీలో ఒక కార్యాలయం నడుపుతున్నారు. బేగం బజార్​, గోషామహల్​, నాంపల్లి, జూబ్లీహిల్స్​ వివిధ ప్రాంతాల నుంచి డబ్బులు సేకరించి.. వేరే వాళ్లకి ఇవ్వడం ఈ గ్యాంగ్​ పని. ఈ క్రమంలోనే వారిని పట్టుకున్నాం. మరింత దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలుపుతాం." - జోయల్ డెవిస్, వెస్ట్ జోన్ డీసీపీ

Police Seized Gold and Money in Hyderabad : హైదరాబాద్​లో పోలీసుల తనిఖీలు.. భారీగా బంగారం, నగదు స్వాధీనం

Fake Notes Found In SBI : SBIలో నకిలీ నోట్ల కలకలం.. ఏకంగా RBIకే పంపిన బ్యాంకు అధికారులు

ఎన్నిక వేళ భారీగా పట్టుపడుతున్న హవాలా సొమ్ము.. మునుగోడుకే పోతోందా..?

Last Updated : Oct 10, 2023, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.