ETV Bharat / sports

అశ్విన్​ 'ట్విట్టర్'​ కష్టాలు.. మస్క్​ మామకు రిక్వెస్ట్​ ట్వీట్​.. ఏం జరిగింది?

author img

By

Published : Mar 15, 2023, 3:38 PM IST

టీమ్​ఇండియా సీనియర్​ ప్లేయర్​ రవిచంద్రన్​ అశ్విన్​.. ఏకంగా ట్విట్టర్​ సీఈవో ఎలాన్​ మస్క్​ను ట్యాగ్​ చేస్తూ ఓ పోస్ట్​ పెట్టాడు. ప్రస్తుతం ఆ ట్వీట్​ వైరల్​గా మారింది. అసలేం జరిగిందంటే?

team india player ravichandran ashwin request tweet to musk viral
team india player ravichandran ashwin request tweet to musk viral

కొందరు క్రికెటర్లు ఆటతోపాటు సోషల్​మీడియాలోనూ చాలా యాక్టివ్​గా ఉంటారు. తరచూ తమకు సంబంధించిన అప్డేట్లను ఫ్యాన్స్​తో పంచుకుంటుంటారు. టీమ్​ఇండియా ఆలౌరౌండర్​ రవిచంద్రన్​ అశ్విన్​ కూడా.. ఇంటర్వ్యూలు, వీడియోలు, ఫొటోలు అప్పుడప్పుడు షేర్ చేస్తుంటాడు. తన అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉండేందుకు ఇష్టపడతాడు. అయితే ఇటీవలే ప్రతిష్ఠాత్మక బోర్డర్- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ ముగియడం వల్ల అతడికి కాస్త విరామం దొరికింది. దీంతో ట్విట్టర్​ను అలా వాడుదామని ఓపెన్​ చేశాడు. కానీ తన ఖాతా సెక్యూరిటీపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎలాన్‌ మస్క్‌కు రిక్వెస్ట్‌ పెట్టాడు.

"నా ట్విట్టర్​ ఖాతాకు సంబంధించి సెక్యూరిటీపై ఆందోళనగా ఉంది. పాప్‌అప్స్‌ తరచూ వస్తున్నాయి. ఆ లింక్‌లను తెరిస్తే ఎలాంటి క్లారిటీ రావడం లేదు. మార్చి 19వ తేదీ వరకు గడువునిస్తూ పాప్‌అప్స్‌ లింక్‌లు కనిపిస్తున్నాయి. కాబట్టి, అప్పటిలోగా నా ఖాతాను భద్రంగా ఎలా ఉంచుకోవాలనేదానిపై మీరు (ఎలాన్‌ మస్క్) మార్గనిర్దేశం చేస్తే బాగుంటుంది" అని ట్విట్టర్​ వేదికగా అశ్విన్‌ పోస్టు చేశాడు.

  • Ok !! how do I get my Twitter account secure before the 19th of March now, I keep getting pop ups but none of the links lead out to any clarity. @elonmusk happy to do the needful. Point us in the right direction pls.

    — Ashwin 🇮🇳 (@ashwinravi99) March 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎలాన్ మస్క్ ట్విట్టర్​ బ్లూటిక్​ను తీసుకొచ్చినప్పటి నుంచి మన దేశంలో అకౌంట్ల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎవరైనా ట్విట్టర్​ బ్లూను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలంటే రెండు దశల్లో నిర్ధరించాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక సేవలను సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నవారికి ట్వీట్లను తొలగించడం, ఎడిట్‌ చేయడం వంటి అదనపు ఫీచర్లు అందుతాయి. అలాగే అధిక నాణ్యతతో కూడిన సుదీర్ఘ వీడియోలను పోస్ట్‌ చేయొచ్చు.

ఇటీవలి కాలంలో ట్విట్టర్​లో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సేవలు నిలిచిపోతున్న ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఎలాన్ మస్క్ ఇటీవల వెల్లడించారు. అయినప్పటికీ తరచూ సేవల్లో అంతరాయం ఏర్పడుతూనే ఉంటోంది. ట్విట్టర్​లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటం కూడా ఈ సమస్యలకు కారణమవుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన వెంటనే కీలక అధికారులు సహా అనేక మంది ఉద్యోగులపై మస్క్ వేటు వేశారు. ట్విట్టర్​ను మస్క్ కొనుగోలు చేయకముందు అందులో 7500 మంది ఉద్యోగులు ఉండగా.. తాజాగా ఈ సంఖ్య రెండు వేలకు చేరింది. అందులోని 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ట్విట్టర్ సబ్​స్క్రిప్షన్ సేవలు ప్రారంభించడంలో కీలకంగా వ్యవహరించిన ఉన్నత ఉద్యోగిని సైతం తీసేసినట్లు సమాచారం.

ట్విట్టర్​కు పోటీగా..
దిగ్గజ సామాజిక మాధ్యమాల మాతృసంస్థ మెటా.. ట్విట్టర్‌కు పోటీగా కొత్త సామాజిక మాధ్యమాన్ని రూపొందిస్తోంది. అంతర్జాతీయంగా ట్విట్టర్‌కు ఉన్న ప్రజాదరణతోపాటు.. ఇప్పుడు ఆ సంస్థ ఎదుర్కొంటున్న గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని సిద్ధం చేస్తోంది. ఉద్యోగుల తొలగింపుతో అప్రతిష్ఠ పాలైన ట్విట్టర్​కు ప్రత్యామ్నాయం కోసం యూజర్లు వెతుకున్నారు. దీంతో ఇదే సరైన సమయంగా భావిస్తున్న మెటా.. ట్విట్టర్‌కు పోటీ ఇచ్చేందుకు ఓ యాప్​ను తయారుచేసేందుకు సిద్ధమైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.