ETV Bharat / sports

Pakistan Team Visa Issue : పాకిస్థాన్​కు వీసా క్లియర్.. షెడ్యూల్ ప్రకారమే హైదరాబాద్​కు

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 7:33 PM IST

Updated : Sep 25, 2023, 9:03 PM IST

Pakistan Team Visa Issue : ఎట్టకేలకు పాకిస్థాన్​ వరల్డ్​ కప్ టీమ్​ భారత్​ వచ్చేందుకు వీసా క్లియర్ అయింది. ఈ మేరకు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.

Pakistan Team Visa Issue
Pakistan Team Visa Issue

Pakistan Team Visa Issue : 2023 ప్రపంచకప్​నకు భారత్​కు రావడానికి పాకిస్థాన్ ప్లేయర్లకు సోమవారం వీసా సమస్య క్లియర్​ అయ్యింది. ఈ మేరకు ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. అయితే వీసా మంజూరు విషయంలో ఆలస్యం అవుతుండడం పట్ల.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఐసీసీకి లేక రాసిన తర్వాత ఈ సమస్య పరిష్కారమైంది. దీంతో యథావిధిగా పాక్ జట్టు ప్లేయర్లు, సిబ్బంది సెప్టెంబర్ 27న హైదరాబాద్​ రానున్నారు.

అంతకుముందు ఐసీసీ సీఈఓ జియోఫ్​ అల్లార్డిస్​కు పీసీబీ ఓ లేఖ రాసింది. అందులో తమ జట్టు ప్లేయర్లకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు, అభిమానులకు వీసా మంజూరు విషయంలో తాము వ్యక్తం చేసిన ఆందోళలను మూడేళ్లుగా పరిష్కరించలేదని తెలిపింది. పాకిస్థాన్​తో ఇలాంటి అవమానకరమైన ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని చెప్పింది.

ICC World Cup 2023 : ఇదే విషయాన్ని పీసీబీ ప్రతినిధి ఉమర్​ ఫరూక్​ పునరుద్ఘాటించారు. వరల్డ్​ కప్​ 2023 కోసం సెక్యూరిటీ క్లియరెన్స్​, భారత్​ వీసా పొందడంలో చాలా జాప్యం జరిగిందన్నారు. గత వారం నుంచి 24 గంటల్లో వీసాలు మంజూరువుతాయని అంటున్నా.. ఇంకా వేచి చూడాల్సి వస్తోందని తెలిపారి. భారత్​ హోం శాఖ ఇంకా ఎన్​ఓసీ మంజూరు చేయలేదని వెల్లడించారు. ప్రపంచ కప్​ లాంటి మెగా టోర్నమెంట్​కు ముందు పాకిస్థాన్​ జట్టుకు వీసా విషయంలో అనిశ్చితి నెలకొనడం నిరాశ కలిగించే విషయమని అన్నారు. తాము రీ-షెడ్యూల్​ రూపొందించాలని.. వీసా జారీకి అనుగుణంగా విమానాలు బుక్​ చేసుకోవాలని ఉమర్​ ఫరూక్​ ఆందోళన వ్యక్తం చేశారు.

షెడ్యూల్​ ప్రకారం పాకిస్థాన్​ జట్టు సెప్టెంబర్​ 27న హైదరాబద్​కు చేరుకోవాలి. అనంతరం సెప్టెంబర్ 29న హైదరాబాద్​ వేదికగా న్యూజిలాండ్​తో ​వార్మప్​ మ్యాచ్​ ఆడాలి. దానికి ముందు దుబాయ్​లో రెండు రోజుల బాండింగ్​ సెషన్​ను పూర్తి చేసుకోవాలి. అయితే పాక్​ టీమ్​కు ఇంకా భారత వీసాలు మంజూరు కాకపోవడం వల్ల.. దుబాయ్​లో జరగాల్సిన బాండింగ్ సెషన్​ రద్దు అయింది. అయితే సోమవారం పాక్​ వరల్డ్ కప్ జట్టుకు వీసా మంజూరు చేసే అవకాశముంది. అదే జరిగితే సెప్టెంబర్​ 27న తెల్లవారుజామున పాక్​ టీమ్​ హైదరాబాద్​కు చేరుకుంటుంది. కాగా.. పాకిస్థాన్​ వీసా దరఖాస్తులకు హోం, విదేశీ వ్యవహారాలు, క్రీడా శాఖ అనుమతి ఇవ్వాల్సిఉంటుంది.

పాకిస్థాన్ చివరి సారిగా 2016లో టీ20 వరల్డ్​ కప్​ కోసం ఇండియాకు వచ్చింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థుల వల్ల ద్వైపాక్షిక సిరీస్​ల జోలికి వెళ్లకుండా.. ఆసియా కప్​, ఐసీసీ టోర్నమెంట్​ల్లోనే ఇరు జట్లు తలపడుతున్నాయి. ఈ వరల్డ్​ కప్​లో అక్టోబర్​ 14న అహ్మదాబాద్​ వేదికగా మరో సారి భారత్​-పాక్​ తలపడనున్నాయి.

మోదీ స్టేడియంలో భారత్- పాక్ మ్యాచ్​.. ICC వరల్డ్​ కప్​ షెడ్యూల్ విడుదల

మల్టీప్లెక్స్​లలో ​వరల్డ్ కప్​ మ్యాచ్​ల లైవ్.. ఏ ప్రాంతాల్లో అంటే?

Last Updated : Sep 25, 2023, 9:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.