ETV Bharat / sports

'అశ్విన్​ను తిట్టిన ధోనీ.. ఎందుకంటే?'

author img

By

Published : Oct 1, 2021, 10:48 PM IST

Ashwin Morgan IPL
రవిచంద్రన్ అశ్విన్

దిల్లీ, కోల్​కతా మధ్య మ్యాచ్​లో అశ్విన్​, మోర్గాన్ (Ashwin Morgan IPL) మధ్య గొడవపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమ్​ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag). 2014లో అశ్విన్​ను ఎంఎస్​ ధోనీ తిట్టినట్లు చెప్పాడు. అందుకు కారణం ఏంటంటే..

ఐపీఎల్​లో (IPL 2021) దిల్లీ క్యాపిటల్స్​, కోల్​కతా నైట్​రైడర్స్​ మధ్య మ్యాచ్ (DC Vs KKR 2021)​ సందర్భంగా రవిచంద్రన్ అశ్విన్, ఇయాన్ మోర్గాన్ (Ashwin Morgan IPL) మధ్య వాగ్వాదం చర్చనీయాంశమైంది. ఈ సంఘటనపై స్పందించిన టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag).. గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నాడు.

ఐపీఎల్​ 2014లో పంజాబ్​ టీమ్​ తరఫున ఆడాడు సెహ్వాగ్. ఆ సమయంలో సీఎస్​కే తరఫున ఆడుతున్న అశ్విన్​.. గ్లెన్ మ్యాక్స్​వెల్(Ashwin Vs Maxwell) వికెట్ తీశాడు. అప్పుడు అశ్విన్ చేసిన పనికి ధోనీ అతడిని మందలించినట్లు తెలిపాడు సెహ్వాగ్(Virender Sehwag).

"నేను పంజాబ్​కు ఆడుతున్నప్పుడు అశ్విన్.. మ్యాక్స్​వెల్ వికెట్ తీశాడు. అప్పుడు కొద్దిగా ధూళి తీసుకొని.. అతడిపై ఊదాడు అశ్విన్. అది నాకు నచ్చలేదు. కానీ ఆ పని క్రీడా స్ఫూర్తికి విరుద్ధమా కాదా అని నేనెప్పుడూ బయట మాట్లాడలేదు. అయితే అశ్విన్​ చేసిన పనికి ఎంఎస్ ధోనీకి (Ashwin Dhoni) కొపమొచ్చి అతడిని తిట్టాడు. అలా చేయడం అశ్విన్ ఇష్టం. మ్యాచ్​ తర్వాత ఈ సంఘటన గురించి ఏ ఆటగాడైనా మీడియాకు చెప్పి ఉంటే చాలా పెద్ద విషయమై ఉండేది. ఫీల్డ్​లో జరిగిన విషయాలు బయటకు తెలియకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్లేయర్లదే."

- వీరేంద్ర సెహ్వాగ్​, టీమ్ఇండియా మాజీ క్రికెటర్

అశ్విన్ x మోర్గాన్

కోల్​కతా, దిల్లీ మ్యాచ్​లో కేకేఆర్​ ఫీల్డర్​ త్రో వేయగా అది పంత్​ చేతికి తాకి వెల్లింది. దీంతో ఎక్స్​ట్రా రన్​ తీశాడు అశ్విన్​. అది నచ్చని కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ (Ashwin Morgan IPL).. క్రీడా స్ఫూర్తికి వ్యతిరేకమని భావించినట్లు ఉన్నాడు. తర్వాతి బంతికి టిమ్​ సౌథీ బౌలింగ్​లో అశ్విన్​ ఔట్ అయ్యాడు. అప్పుడు మోర్గాన్, సౌథీ, అశ్విన్​కు (Ashwin Morgan Southee) మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. దినేశ్ కార్తీక్ సర్దిచెప్పే ప్రయత్నం చేసి వారిని దూరం పంపించేశాడు.

తెలిసినా చేసేవాడ్ని..

ఆ తర్వాత ఈ సంఘటనపై వరుస ట్వీట్లు చేసిన అశ్విన్.. బంతి పంత్ (Ashwin Morgan Pant) చేతికి తగిలినట్లు తనకు తెలియదని చెప్పాడు. ఒక వేళ తెలిసినా.. అది నిబంధనలకు విరుద్ధం కాదు కాబట్టి.. పరుగు కోసం ప్రయత్నించేవాడనని వెల్లడించాడు.

ఈ మ్యాచ్​లో (DC vs KKR 2021) 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది కేకేఆర్. దిల్లీ విధించిన 128 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో ఛేదించింది. మొదట ఓపెనర్ గిల్ 30 పరుగులతో రాణించగా.. నితీశ్ రానా (36*) తనదైన బ్యాటింగ్​తో జట్టుకు విజయాన్ని అందించాడు. సునీల్ నరేన్ చివర్లో 10 బంతుల్లో 21 పరుగులతో మెరిశాడు.

ఇవీ చూడండి:

IPL 2021 News: టాస్ గెలిచిన పంజాబ్.. కోల్​కతా బ్యాటింగ్

IPL 2021: ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం: రాహుల్

IPL 2021: 'ఆ విషయంలో హార్దిక్​ను బలవంతం చేయలేం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.