ETV Bharat / sports

అఫ్గానిస్థాన్​కు లైన్​ క్లియర్​.. టీ20 ప్రపంచకప్​కు సిద్ధం

author img

By

Published : Oct 10, 2021, 5:16 PM IST

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) పాల్గొనేందుకు అఫ్గానిస్థాన్​ జట్టు సిద్ధంగా ఉందని అన్నాడు ఐసీసీ సీఈఓ(ICC CEO) జియోఫ్​ అలాడైస్​. అయితే తాలిబన్ల జెండాతో ఆ దేశ జట్టు ప్రపంచకప్​లో పాల్గొనాలనుకుంటే టీమ్​పై నిషేధం విధించే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.

Afghanistan preparing to participate in T20 World Cup: ICC Acting CEO
టీ20 ప్రపంచకప్​ ఆడేందుకు అఫ్గానిస్థాన్​ జట్టు సిద్ధం

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) పాల్గొనేందుకు అఫ్గానిస్థాన్​ జట్టు సిద్ధంగా ఉందని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC CEO) సీఈఓ జియోఫ్​ అలాడైస్​ వెల్లడించాడు. అయితే ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని తెలిపాడు. అఫ్గాన్​లో ప్రస్తుతం తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో వారి జెండాతో టోర్నీలో ఆడాలనుకుంటే మాత్రం ఆ జట్టుపై ఐసీసీ నిషేధం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

"ఐసీసీలో అఫ్గాన్​ క్రికెట్​ బోర్డు పూర్తి సభ్యత్వం కలిగి ఉంది. టీ20 ప్రపంచకప్​లో పాల్గొనేందుకు ఆ దేశ జట్టు సిద్ధమవుతోంది. షెడ్యూల్​ ప్రకారం జరిగే మ్యాచ్​ల్లో వారు పాల్గొంటారు. ఆగస్టు నుంచి అఫ్గానిస్థాన్​లో పాలన మార్పు జరిగినప్పటి నుంచి ఆ దేశ క్రికెట్​ బోర్డుతో మేము క్రమం తప్పకుండా సంప్రదిస్తూనే ఉన్నాం. ఆ దేశంలో క్రికెట్​ అభివృద్ధికి మద్దతు తప్పక ఇస్తాం. అయితే ఆ దేశ క్రికెట్​ బోర్డులో రాజకీయ జోక్యం ఎలా ఉందనే దానిపై ఎప్పటికప్పుడూ పరిశీలిస్తూనే ఉన్నాం. టీ20 ప్రపంచకప్​ తర్వాత దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది".

- జియోఫ్​ అలాడైస్​, ఐసీసీ సీఈఓ

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత ఆ దేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. తీవ్ర ఆందోళనల నేపథ్యంలో ఆ దేశ ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత దేశంలో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు జరగడం సహా అఫ్గాన్​ క్రికెట్​ బోర్డు(Afghanistan Cricket Board CEO) సీఈఓగా నసీద్​ జర్దాన్​ ఖాన్​ను​ నియమించడం జరిగింది.

ఇదీ చూడండి.. టీ20 ప్రపంచకప్​ విజేతకు ప్రైజ్​మనీ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.