ETV Bharat / sports

కెప్టెన్​ కోహ్లీ.. ఈ దశాబ్దంలోనే ఆ విషయంలో టాప్

author img

By

Published : Dec 10, 2020, 3:40 PM IST

Updated : Dec 10, 2020, 4:03 PM IST

గత పదేళ్లలో అత్యంత ప్రభావం చూపిన ఆటగాడు కోహ్లీనే అని మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ చెప్పాడు. తాను బాగా ఆడటం సహా ఎన్నో మ్యాచ్​ల్ని గెలిపించాడని తెలిపాడు.

Kohli most impactful player in this decade: Gavaskar
'అత్యంత ప్రభావం చూపిన ఆటగాడు కోహ్లీనే'

టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. గత దశాబ్ద కాలంలో అత్యంత ప్రభావం చూపిన ఆటగాడని మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అన్నాడు. గత పదేళ్లలో విరాట్ గెలిచిన మ్యాచ్​ల గణాంకాల దృష్ట్యా ఈ వ్యాఖ్య చేశాడు.

Kohli most impactful player in this decade: Gavaskar
సునీల్ గావస్కర్

"కోహ్లీ సారథ్యంలోనే భారత్​ ఎక్కువ మ్యాచ్​లు గెలిచింది. అందుకే అతడు అత్యంత ప్రభావం చూపిన ఆటగాడు. కేవలం ఎక్కువ పరుగులు, వికెట్లు తీసిన వారి ఆధారంగా ఈ మాటలు అనడం లేదు. మొత్తం మ్యాచ్​ల్లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి, అత్యంత ప్రభావితం చేసిన ఆటగాడి గురించి మాట్లాడుతున్నాను"

-సునీల్ గావస్కర్, భారత మాజీ ఆటగాడు

ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ఇందుకు భిన్నంగా స్పందించాడు. వన్డేల్లో ధోనీనే అత్యంత ప్రభావం చూపిన అటగాడని అభిప్రాయపడ్డాడు.

"మహేంద్ర సింగ్ ధోనీ.. భారత్​కు వన్డే, టీ20 ప్రపంచకప్​, ఛాంపియన్స్​ ట్రోఫీ తెచ్చిపెట్టాడు. నా దృష్టిలో ప్రపంచకప్​ సాధించడం ఓ ఘనత. అంతేకాక, మిడిలార్డర్​లో ధోనీ మంచి ఆటగాడు"

-హేడెన్, ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్​మన్

2008లో కెరీర్​ ప్రారంభించిన కోహ్లీ.. అన్ని ఫార్మాట్లలో ఉత్తమ ఆటగాడిగా ఎదిగాడు. ఇటీవలే వన్డేల్లో 12,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో దిగ్గజ సచిన్ రికార్డును అధిగమించాడు.

ఇదీ చదవండి:'బాక్సింగ్​ డే' టెస్టుకు ప్రేక్షకుల సంఖ్య పెంపు

Last Updated :Dec 10, 2020, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.