ETV Bharat / sports

సచిన్​ను అధిగమించిన కోహ్లీ- వన్డేల్లో సరికొత్త రికార్డు

author img

By

Published : Dec 2, 2020, 10:16 AM IST

Updated : Dec 2, 2020, 10:36 AM IST

స్టార్ క్రికెటర్ కోహ్లీ.. వన్డేల్లో మరో ఘనత సాధించాడు. ప్రపంచంలోనే అందరికంటే వేగంగా 12వేల పరుగుల మార్క్​ను అందుకున్నాడు.

kohli becomes fastest batsman to reach 12000 ODI runs
సచిన్​ అధిగమించిన కోహ్లీ.. వన్డేల్లో సరికొత్త రికార్డు

టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 242 ఇన్నింగ్స్​ల్లో 12వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా ఈ మార్క్​ను చేరుకున్నాడు.

అతడి తర్వాతి స్థానాల్లో సచిన్ తెందుల్కర్(300 ఇన్నింగ్స్​లు), పాంటింగ్(314), కుమార సంగక్కర(336), సనత్ జయసూర్య(379), మహేల జయవర్ధనే(399) ఉన్నారు.

మూడు వన్డేల సిరీస్​ను ఇప్పటికే 2-0 తేడాతో ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. నామమాత్ర మూడో వన్డే కాన్​బెర్రా వేదికగా జరుగుతోంది. అనంతరం మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆసీస్​తో భారత జట్టు ఆడనుంది.

Last Updated : Dec 2, 2020, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.