ETV Bharat / sports

ఆర్సీబీలో కెప్టెన్ కోహ్లీ స్థానానికి గండి?

author img

By

Published : Aug 31, 2020, 7:12 PM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి వచ్చిన ఫించ్.. ఏ స్థానంలో బ్యాటింగ్​ చేస్తాడా? అనేది ఇప్పుడు అందరికి వస్తున్న ప్రశ్న. ఒకవేళ ఇతడు ఓపెనింగ్ చేయాలంటే, ఇప్పటికే ఆ స్థానాల్లో ఆడుతున్న పార్థివ్ పటేల్, కోహ్లీలలో ఒకరు త్యాగం చేయాల్సి ఉంటుంది.

IPL 2020: Virat Kohli or Aaron Finch as RCB opener?
ఫించ్​ రాకతో కోహ్లీ స్థానానికి గండి పడినట్లేనా!

గతేడాది ఐపీఎల్​ వేలంలో బెంగళూరు జట్టు ఆస్ట్రేలియా ఆటగాడు ఫించ్​ను దక్కించుకుంది. ఇప్పుడు అతడిని ఏ స్థానంలో బ్యాటింగ్​కు పంపాలనేది పెద్ద ప్రశ్నగా మారింది. గత సీజన్​ వరకు ఆర్సీబీ ఓపెనర్లుగా పార్థివ్​ పటేల్​, విరాట్​ కోహ్లీ వచ్చారు. ఇప్పుడు ఆసీస్ తరఫున ఓపెనర్​గా రాణిస్తున్న ఆరోన్​ ఫించ్​ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో బెంగళూరు టాప్​ ఆర్డర్​ మారొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎవరు త్యాగం చేస్తారో?

ఫించ్​ అత్యుత్తమ ఓపెనర్లలో ఒకడిగా​ గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో ఇతడిని జట్టులోకి తీసుకుంటే పార్థివ్​​, కోహ్లీలలో ఒకరు తమ స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఫించ్​ను ఎవరి స్థానంలో దింపాలనే విషయమై ఆర్సీబీ కూడా మల్లగుల్లాలు పడుతుందట.

అది రహస్యం!​

ఫించ్​ రాకతో ఆర్సీబీ బ్యాటింగ్​ టాప్​ ఆర్డర్​లో మార్పు రానుందా? అనే ప్రశ్నను జట్టు డైరెక్టర్​ మైక్​ హెసన్​ స్పందించాడు. స్టార్​ బ్యాట్స్​మెన్స్​ కోహ్లీ, ఫించ్​లలో ఎవరు ఒకరు బరిలో దిగుతారా.. లేదా ఇద్దరూ కలిసి ఓపెనింగ్​ చేస్తారా? అనే ప్రశ్నకు తాను సమాధానం చెప్పలేనని అన్నాడు. ఎందుకంటే అది తమ వ్యూహమని తెలిపాడు​. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు యూఏఈ వేదికగా ప్రస్తుత సీజన్​ జరగనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.