బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న ఆఖరి టెస్టుకు అంతరాయం కలిగింది. నాలుగో రోజు ఆటలో భాగంగా మూడో సెషన్లో వరుణుడు అడ్డంకిగా మారడం వల్ల ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. ఫలితంగా ఇంకా 23 ఓవర్లు మిగిలి ఉండగానే ఆటను ముగించేశారు.
-
Rain stops play at The Gabba 🌧️#AUSvIND ⏩ https://t.co/oDTm209M8z pic.twitter.com/LrgS2ANwoL
— ICC (@ICC) January 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Rain stops play at The Gabba 🌧️#AUSvIND ⏩ https://t.co/oDTm209M8z pic.twitter.com/LrgS2ANwoL
— ICC (@ICC) January 18, 2021Rain stops play at The Gabba 🌧️#AUSvIND ⏩ https://t.co/oDTm209M8z pic.twitter.com/LrgS2ANwoL
— ICC (@ICC) January 18, 2021
ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ఛేదన మొదలుపెట్టిన భారత్ నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి 4/0తో నిలిచింది. క్రీజులో రోహిత్ (4), గిల్ ఉన్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 21/0తో ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 294 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు సిరాజ్ ఐదు, శార్దూల్ నాలుగు వికెట్లతో సత్తాచాటారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో భారత్కు ఆసీస్ 328 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
రోహిత్ రికార్డు..
ఆస్ట్రేలియాపై టెస్టుల్లో ఐదు క్యాచ్లు అందుకున్న ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సాధించాడు. గబ్బా టెస్టులో ఈ టీమ్ఇండియా ఆటగాడు 5 క్యాచ్లు పట్టాడు. అంతకుముందు సోల్కర్, కే. శ్రీకాంత్, రాహుల్ ద్రావిడ్ కూడా ఈ ఘనత సాధించారు.
ఇదీ చూడండి : ఆస్ట్రేలియా 294 ఆలౌట్.. భారత్ లక్ష్యం 328