ETV Bharat / sitara

బాలయ్యకు హీరోయిన్​గా​ శ్రుతిహాసన్ ఫిక్స్

author img

By

Published : Nov 4, 2021, 7:17 PM IST

Nandamuri Balakrishna
బాలకృష్ణ

అగ్రకథానాయకుడు బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి కథానాయిక ఎవరో తెలిసిపోయింది. శ్రుతిహాసన్​, బాలయ్యతో కలిసి సందడి చేయనుంది.

నందమూరి బాలకృష్ణకు కొత్త హీరోయిన్ దొరికేసింది. ఆయన హీరోగా చేయబోయే కొత్త సినిమాలో శ్రుతిహాసన్ కథానాయికగా ఎంపికైంది. ఈ విషయాన్ని దీపావళి సందర్భంగా ప్రకటించారు. పోస్టర్​ను కూడా విడుదల చేశారు. అయితే నిజ జీవిత కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

Shruti Haasan
శ్రుతిహాసన్

ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. గోపీచంద్ ఇంతకు ముందు తీసిన 'బలుపు', 'క్రాక్' చిత్రాల్లో హీరోయిన్​గా శ్రుతిహాసన్​ నటించింది. దీంతో ఆమెను మరోసారి తన సినిమా కోసం ఎంపిక చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.