పునీత్ పార్థివ దేహం వద్ద బాలకృష్ణ కన్నీటి పర్యంతం

author img

By

Published : Oct 30, 2021, 12:12 PM IST

Updated : Oct 30, 2021, 2:17 PM IST

punith rajkumar last rites
పునీత్ రాజ్​కుమార్ ()

నందమూరి బాలకృష్ణ.. హీరో పునీత్ రాజ్​కుమార్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చుతూ కన్నీటి పర్యంతమయ్యారు.

కన్నడ హీరో పునీత్ రాజ్​కుమార్ పార్థివదేహానికి టాలీవుడ్ కథానాయకుడు బాలకృష్ణ నివాళులర్పించారు. అక్కడే కన్నీరుపెట్టుకున్నారు. ఆ తర్వాత పునీత్ కుటుంబసభ్యుల్ని ఓదార్చారు. అతడి సోదరుడు శివరాజ్​కుమార్​ను కూడా ఓదార్చారు.

.

పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్.. గుండెపోటుతో శుక్రవారం కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని బెంగళూరులోని కంఠీరవ మైదానంలో ఉంచారు. పునీత్​చివరి చూపు కోసం సినీ ప్రముఖులు, అభిమానులు తరలివస్తున్నారు.

తన ప్రాణమిత్రుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణవార్తతో తారక్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తన స్నేహితుడిని చివరిసారిగా చూసుకునేందుకు ఎన్టీఆర్‌ శనివారం బెంగళూరు వెళ్లారు. పునీత్‌ పార్థివదేహానికి నివాళులర్పించి, ఆయన కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. మరోవైపు, నందమూరి కుటుంబసభ్యులు, అందులోనూ తారక్‌తో పునీత్‌కు ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది. పునీత్‌-తారక్‌ ఎంతో కాలంగా మంచి స్నేహితులు. పునీత్ నటించిన ‘చక్రవ్యూహ’ సినిమాలో ఎన్టీఆర్‌ ‘గెలయా గెలయా’ అనే పాట ఆలపించారు.

punith rajkumar ntr
పునీత్ రాజ్​కుమార్ ఎన్టీఆర్

ఇవీ చదవండి:

Last Updated :Oct 30, 2021, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.