ETV Bharat / sitara

ఆస్కార్ నామినేషన్లు వెల్లడించనున్న ప్రియాంక దంపతులు

author img

By

Published : Mar 11, 2021, 10:26 AM IST

oscar
ఆస్కార్​

ప్రతిష్ఠాత్మక ఆస్కార్​ అవార్డు నామినేషన్లను మార్చి 15న ప్రకటించనున్నారు స్టార్​ దంపతులు ప్రియాంకా చోప్రా, నిక్​ జోనస్. కాగా, ప్రియాంక ప్రస్తుతం 'మ్యాట్రిక్స్ 4', 'టెక్స్ట్ ఫర్ యూ' చిత్రాల్లో నటిస్తున్నారు.

ప్రపంచ సినీచరిత్రలో ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్​ అవార్డు నామినేషన్లను మార్చి 15(సోమవారం)న ప్రకటించనున్నారు స్టార్​ కపుల్ ప్రియాంకా చోప్రా, నిక్​ జోనస్​. మొత్తంగా 23 విభాగాల్లో నామినేట్​ అయిన వారి పేర్లను వెల్లడించనున్నారు. ఈ విషయాన్ని వారిద్దరే స్వయంగా ఓ వీడియో సందేశం ద్వారా తెలిపారు. వర్చువల్​ రూపంలో ఈ పేర్లను ప్రకటిస్తారు. ఏప్రిల్​ 25న ఈ పురస్కార వేడుక నిర్వహించనున్నారు.

కాగా, ఈ ఏడాది ప్రారంభంలో 'ది వైట్ టైగర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రియాంకా చోప్రా.. ప్రస్తుతం 'మ్యాట్రిక్స్ 4', 'టెక్స్ట్' ఫర్ యూ చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి: 'ఆస్కార్​ పురస్కారాల వేడుక వర్చువల్​గా ఉండదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.